Opposition Meeting: నేడు పాట్నా వేదికగా విపక్షాల సమావేశం.. బీజేపీని అడ్డుకోవడమే టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition Meeting: జాతీయ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన నేడు విపక్షాల సమావేశం జరగబోతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అడ్డుకోవడమే ధ్యేయంగా ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు. గురువారం ఆమె ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ని కలిశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సమావేశమయ్యారు. నితీష్ తో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మేమంతా ఒకే కుటుంబంగా కలిసి పోరాడుతామని విపక్షాల ఐక్యత గురించి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
మరోవైపు శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి పాట్నా బయలుదేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు తదితరులు హాజరుకానున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో విపక్షాలన్ని సమావేశమవుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీని గద్దె దించడానికి జయప్రకాష్ నారాయణ చేసిన విధంగానే ఈసారి నితీష్ కుమార్ చేయాలని భావిస్తున్నారు.
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
విపక్షాల్లో లుకలుకలు:
ఇదిలా ఉంటే భేటీకి ముందే విపక్షాల్లో లుకలుకలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఎల్డీ ప్రెసిడెంట్ జయంత్ చౌదరి ఈ సమావేశానికి రానని ప్రకటించారు. దీన్ని ఒక కుటుంబ కార్యాక్రమంగా ఆయన అభివర్ణించారు. మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతికి ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఇక వైసీసీ, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీ అధినేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించలేదు.
కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి పొసగడం లేదు. బీజేపీ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ గురించి కాంగ్రెస్ ఆప్ కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక బెంగాల్ లో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తే మద్దతు ఇవ్వలేనని ఇప్పటికే మమతా చెప్పారు. ఈ నేపథ్యంలో వీరందరి మధ్య సయోధ్య కుదురుతుందా..? లేదా.? అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు యూపీలో బీజేపీ ఓడించాలంటే అన్ని పార్టీలు తమ వెనక నిలబడాలని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కోరుతున్నారు.
ప్రతిపక్షాల ఐక్యతపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ మాట్లాడుతూ.. అవినీతి అంతా ఒక్క చోట చేరుతోందని అన్నారు. ముందుగా మీ ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియజేయాలని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!