Operation Trishul: పాకిస్తాన్కు అదిరిపోయే దెబ్బ కొట్టిన భారత్.. సరిహద్దు వెంబడి త్రిశూల్ విన్యాసాలు..
- పాకిస్తాన్ను అదిరిపోయే దెబ్బ కొట్టిన భారత్..
- పాక్ సరిహద్దుల్లో త్రిశూల్ త్రివిధ దళాల విన్యాసాలు..
- దాయాది దేశానికి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన రాజ్నాథ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Trishul: పాకిస్తాన్ను భారత్ మరోసారి అదిరిపోయే దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి త్రిశూల్ త్రివిధ దళాల విన్యాసాల నేపథ్యంలో పాకిస్తాన్ తన మధ్య, దక్షిణ వాయు ప్రాంతాల్లో పలు ఎయిర్ ట్రాఫిక్ మార్గాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 28, 29 తేదీలకు సంబంధించి NOTAM (Notice to Airmen) జారీ చేసినప్పటికీ, దాని వెనుక కారణాన్ని ఇస్లామాబాద్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇక, భారత ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతంలో భారీ త్రివిధ దళాల విన్యాసాలకు సంబంధించి NOTAM జారీ చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ఇలాంటి సరిహద్దు సైనిక విన్యాసాల సమయంలో ఇరు దేశాలు NOTAMలు జారీ చేయడం సాధారణం అయింది.
Read Also: Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్పై బన్నీ స్పెషల్ మెసేజ్
Also Read
- CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్పై స్టాలిన్ విమర్శలు
- Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
- Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
- Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్కు జిన్పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
* త్రిశూల్ విన్యాసాల ప్రాముఖ్యత
త్రిశూల్ విన్యాసాల కోసం కేటాయించిన వైమానిక పరిధి 28,000 అడుగుల ఎత్తు వరకు విస్తరించింది. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత కీలక సంయుక్త సైనిక విన్యాసాల్లో ఒకటిగా చెప్పాలి. ఇక, రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ఈ విన్యాసాల్లో సైన్యం, నౌకాదళం, వాయుసేన మూడు విభాగాలూ పాల్గొననున్నాయి. ఇది సంయుక్త ఆపరేషనల్ సామర్థ్యాలు, ఆత్మనిర్భర్ భారత్ సూత్రం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించడమే లక్ష్యమని పేర్కొంది. దక్షిణ కమాండ్ దళాలు ఈ విన్యాసాల్లో చురుకుగా పాల్గొంటాయి. క్రీక్ అండ్ ఎడారి ప్రాంతాల్లో దాడి వ్యూహాలు, సౌరాష్ట్ర తీరంలో విన్యాసాలు, బహుముఖ ఆపరేషనల్ వ్యాయామాలు నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
* సర్ క్రీక్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం..
ఈ విన్యాసాలు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్-సింధ్-కరాచీ అక్షం ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనిపై ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక చర్యలపై హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సర్ క్రీక్ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తే, భారత సైన్యం ఇచ్చే సమాధానం చరిత్రలో గుర్తుండి పోతుందని వార్నింగ్ ఇచ్చారు. కాగా, పాకిస్తాన్ సర్ క్రీక్ ప్రాంతంలో తన సైనిక మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడానికి ప్లాన్ చేస్తుందని ఇటీవల ఇంటెలిజెన్స్ నివేదిక పంపించింది.
తాజావార్తలు
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్పై భారత్ 19-0తో సంచలన విజయం.!
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?