Operation Trishul: పాకిస్తాన్కు అదిరిపోయే దెబ్బ కొట్టిన భారత్.. సరిహద్దు వెంబడి త్రిశూల్ విన్యాసాలు..
- పాకిస్తాన్ను అదిరిపోయే దెబ్బ కొట్టిన భారత్..
- పాక్ సరిహద్దుల్లో త్రిశూల్ త్రివిధ దళాల విన్యాసాలు..
- దాయాది దేశానికి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన రాజ్నాథ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Trishul: పాకిస్తాన్ను భారత్ మరోసారి అదిరిపోయే దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి త్రిశూల్ త్రివిధ దళాల విన్యాసాల నేపథ్యంలో పాకిస్తాన్ తన మధ్య, దక్షిణ వాయు ప్రాంతాల్లో పలు ఎయిర్ ట్రాఫిక్ మార్గాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 28, 29 తేదీలకు సంబంధించి NOTAM (Notice to Airmen) జారీ చేసినప్పటికీ, దాని వెనుక కారణాన్ని ఇస్లామాబాద్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇక, భారత ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతంలో భారీ త్రివిధ దళాల విన్యాసాలకు సంబంధించి NOTAM జారీ చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ఇలాంటి సరిహద్దు సైనిక విన్యాసాల సమయంలో ఇరు దేశాలు NOTAMలు జారీ చేయడం సాధారణం అయింది.
Read Also: Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్పై బన్నీ స్పెషల్ మెసేజ్
Also Read
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
* త్రిశూల్ విన్యాసాల ప్రాముఖ్యత
త్రిశూల్ విన్యాసాల కోసం కేటాయించిన వైమానిక పరిధి 28,000 అడుగుల ఎత్తు వరకు విస్తరించింది. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత కీలక సంయుక్త సైనిక విన్యాసాల్లో ఒకటిగా చెప్పాలి. ఇక, రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ఈ విన్యాసాల్లో సైన్యం, నౌకాదళం, వాయుసేన మూడు విభాగాలూ పాల్గొననున్నాయి. ఇది సంయుక్త ఆపరేషనల్ సామర్థ్యాలు, ఆత్మనిర్భర్ భారత్ సూత్రం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించడమే లక్ష్యమని పేర్కొంది. దక్షిణ కమాండ్ దళాలు ఈ విన్యాసాల్లో చురుకుగా పాల్గొంటాయి. క్రీక్ అండ్ ఎడారి ప్రాంతాల్లో దాడి వ్యూహాలు, సౌరాష్ట్ర తీరంలో విన్యాసాలు, బహుముఖ ఆపరేషనల్ వ్యాయామాలు నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
* సర్ క్రీక్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం..
ఈ విన్యాసాలు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్-సింధ్-కరాచీ అక్షం ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనిపై ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక చర్యలపై హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సర్ క్రీక్ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తే, భారత సైన్యం ఇచ్చే సమాధానం చరిత్రలో గుర్తుండి పోతుందని వార్నింగ్ ఇచ్చారు. కాగా, పాకిస్తాన్ సర్ క్రీక్ ప్రాంతంలో తన సైనిక మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడానికి ప్లాన్ చేస్తుందని ఇటీవల ఇంటెలిజెన్స్ నివేదిక పంపించింది.
తాజావార్తలు
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..