Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా “రన్వే”లు రిపేర్ చేసుకునే పనిలో పాకిస్తాన్..
- భారత్ దెబ్బకు రన్వేలు రిపేర్ చేసుకుంటున్న పాకిస్తాన్..
- రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ ‘‘నోటామ్ ’’ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’తో విరుచుకుపడింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ హెడ్క్వార్టర్స్ అయిని మురిడ్కే, బహవల్పూర్ కూడా ఉన్నాయి. 100 మందికిపైగా టెర్రరిస్టులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్పైకి దాడులు ప్రారంభించింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
పాకిస్తాన్ కవ్వింపులకు సమాధానంగా భారత్, పాకిస్తాన్లోని 11 వైమానిక స్థావరాలను క్షిపణులతో ధ్వంసం చేసింది. ముఖ్యంగా, పాక్ సైన్యం ప్రధాన కార్యాలయంలో ఉండే రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని భారత్ అటాక్ చేసింది. నూర్ ఖాన్తో పాటు సర్గోదా, రహియ్ యార్ ఖాన్, రఫీకీ, చక్లాలా, సుక్కూర్, సియాల్ కోట్ వంటి ఎయిర్ బేస్లు భారత దాడుల్లో ధ్వంసమయ్యాయి.
Also Read
Read Also: AK-203 Rifle: భారత్ కా ‘షేర్’ AK-203.. నిమిషానికి 700 బుల్లెట్లు, 800 మీటర్ల రేంజ్..
అయితే, ఇప్పుడు పాకిస్తాన్ ధ్వంసమైన వైమానిక స్థావరాలను గత రెండు నెలల నుంచి పునరుద్ధరిస్తూనే ఉంది. ముఖ్యంగా, దెబ్బతిన్న రన్వేలను రిపేర్ చేస్తోంది. ఇదే కాకుండా కీలకమైన మిలిటరీ ఇన్స్టాలేషన్లను మళ్లీ నిర్మించే పనిలో ఉంది. తాజాగా, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్వేని మూసివేతను మూడోసారి పొడగించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ ఎయిర్ బేస్ రన్వేను భారత్ ధ్వంసం చేసింది. రన్వేపై పెద్ద గుంత ఏర్పడింది.
రన్వే పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ తాజాగా ‘‘నోటమ్’’ జారీ చేసింది. ఆగస్టు 5 వరకు రన్వే కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఎలాంటి కారణం పేర్కొనకుండా నోటమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 10 తర్వాత భారత్ దాడి చేయడం వల్ల తొలిసారి నోటమ్ జారీ చేసింది. అప్పటి వరకు విమాన కార్యకలాపాలకు అందుబాటులో ఉండదని పేర్కొంది. పంజాబ్ ప్రావిన్సులో ఉన్న ఈ రహీమ్ యార్ ఖాన్ ఇటు పాక్ మిలిటరీ, అటు పౌర విమాన సేవలు అందించే షేక్ జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిగి ఉంది.
తాజావార్తలు
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
-
Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!