Operation Sindoor: 15 బ్రహ్మోస్ మిస్సైల్స్తో పాకిస్తాన్లో విధ్వంసం.. ఇండియా ప్లాన్ అదుర్స్..
- ఆపరేషన్ సిందూర్లో ఇండియా ప్లాన్ అదుర్స్..
- 15 బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ ఎయిర్ బేస్లు ధ్వంసం..
- డమ్మీ జెట్లతో పాక్ రాడార్స్ గుర్తించిన ఇండియా..
- ఆ తర్వాత పాక్ ఎయిర్ డిఫెన్స్ నిర్వీర్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్కి రుచిచూపించింది. పాక్తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్లు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. 13 పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ సైన్యం నడ్డి విరిచింది. అయితే, ఈ ఆపరేషన్ నిర్వహించడానికి భారత్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Madras High Court: నిందితులు మాత్రమే పోలీస్ టాయ్లెట్స్లో ఎందుకు జారిపడుతున్నారు..?
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ముందుగా, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి సంబంధించి రాడార్లు, క్షిపణి వ్యవస్థల్ని యాక్టివేట్ చేసేలా, భారత వైమానిక దళం పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఒక విధంగా చెప్పాలంటే డమ్మీ జెట్స్ని ఉపయోగించింది. దీంతో పాకిస్తాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయనేది భారత్కి తెలిసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ కావడంతోనే భారత్ హరోప్, కామికేజ్ డ్రోన్లను ఉపయోగించి వాటిపై దాడి చేసి, పాక్ ఎయిర్ డిఫెన్స్ పనిచేయకుండా చేసింది. ఈ వ్యూహంతో భారత్ పాకిస్తాన్కి చైనా ఇచ్చిన HQ-9 క్షిపణి బ్యాటరీలతో సహా దాని రాడార్ని నాశనం చేసింది.
దీని తర్వాత, భారత్ తన అమ్ములపొదిలోని బ్రహ్మోస్ క్షిపణితో పాటు స్కాల్ప్ వంటి క్షిపణుల్ని ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా ప్రయోగించి మొత్తం 11 పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. రిపోర్టుల ప్రకారం దాదాపుగా భారత్ 15 బ్రహ్మోస్ క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఒక ఘర్షణ సమయంలో భారత్ తొలిసారిగా బ్రహ్మో్స్ని వాడింది. ఈ దాడి భయంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తన విమాన స్థావరాలను మార్చాల్సి వచ్చింది. ఈ దాడిలో పాక్లో అత్యంత ముఖ్యమైన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫికీ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, స్కర్దు, జకోబాబాద్ వంటి వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!