Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్కి దెబ్బ, చైనాకు నొప్పి..
- ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ని దెబ్బ..
- చైనా ఆయుధాలు, రాడార్లను దెబ్బకొట్టిన భారత్..
- ఒక్క క్షిపణిని ట్రాక్ చేయని hq-9 ఎయిర్ డిఫెన్స్..
- చైనా పరికరాలు, ఆయుధాల పనితీరుని బయటపెట్టిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్తో భారత్ పాకిస్తాన్ మెడలు వంచుతోంది. ఇన్నాళ్లు మేము ప్రపంచంలోనే తోపు ఆర్మీ అని ఫీల్ అవుతున్న పాకిస్తాన్ని, అలా నమ్ముతున్న అక్కడి ప్రజలకు నెమ్మదిగా అసలు విషయాలు తెలిసి వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తో పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది చాలదన్నట్లుగా, బుధవారం-గురువారం రాత్రి సమయంలో భారత్పైకి క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడిని మన ‘‘ఎస్-400 సుదర్శన చక్ర’’ సమర్థవంతంగా అడ్డుకుంది.
అయితే, భారత్ దెబ్బ పాకిస్తాన్కి పడుతున్నా, నొప్పి మాత్రం చైనాకు కలుగుతోంది. ఎందుకంటే, భారత సైనిక పాటవాల ముందు చైనా రక్షణ వ్యవస్థలు ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిజానికి చైనా ఉత్పత్తులు అంటేనే చీప్ అనే వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం భారత్ దీనిని నిరూపిస్తోంది. భారత్, పాక్ ఘర్షణలో తాము ఎంత నష్టపోతున్నామనే విషయం చైనాకు తెలిసి వస్తోంది.
Also Read
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
Read Also: Operation Sindoor: ఏడవడం ఒక్కటే తక్కువ.. పాకిస్తాన్ పార్లమెంటులో ఎమోషనలైన ఎంపీ.. వీడియో వైరల్!
చైనా ఎయిర్ డిఫెన్స్, క్షిపణులు ధ్వంసం:
ముఖ్యంగా, చైనా తయారీ వ్యవస్థలు భారత్ దాడుల ముందు పనిచేయడం లేదు. చైనా తయారు చేసిన పాకిస్తాన్ HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థలు దాడుల సమయంలో అస్సలు పసిగట్టలేకపోయాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పీఓకే, పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లో 9 స్థావరాల్లో 24 దాడులు నిర్వహిస్తే ఒక్క క్షిపణిని కూడా గుర్తించి, అడ్డుకోలేకపోయింది.
ఇక, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్లోని 15 నగరాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ దాడుల్ని ఎస్-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుంది. ఈ దాడిలో పాక్ ఉపయోగించినవి చైనా మిస్సైల్స్ అని తేలింది. గురువారం ఉదయం భారత్ ఏకంగా లాహోర్లోని HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థని భారత్ ఇజ్రాయిల్ తయారీ క్షిపణులు ధ్వంసం చేశాయి.
ఈ పరిణామాలు చైనాకు మింగుడు పడటం లేదు. భారత దాడితో చైనా ఆయుధాల పనితీరును ప్రపంచానికి బహిర్గతం అయింది. రానున్న రోజుల్లో చైనా మిలిటరీ పరికరాలు, ఆయుధాలను పాకిస్తాన్ మినహా ఏ దేశం కూడా కొనే పరిస్థితి ఉండదు. ఇదిలా ఉంటే, భారత్ తన ఆకాష్ మిస్సైల్తో చైనా తయారీ జేఎఫ్ 17 యుద్ధ విమానాన్ని మన ఆకాష్ మిస్సైల్ కూల్చేసిందని తెలుస్తోంది. అయితే, దీనిపై పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేయకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఇది తెగ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!