Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్కి దెబ్బ, చైనాకు నొప్పి..
- ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ని దెబ్బ..
- చైనా ఆయుధాలు, రాడార్లను దెబ్బకొట్టిన భారత్..
- ఒక్క క్షిపణిని ట్రాక్ చేయని hq-9 ఎయిర్ డిఫెన్స్..
- చైనా పరికరాలు, ఆయుధాల పనితీరుని బయటపెట్టిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్తో భారత్ పాకిస్తాన్ మెడలు వంచుతోంది. ఇన్నాళ్లు మేము ప్రపంచంలోనే తోపు ఆర్మీ అని ఫీల్ అవుతున్న పాకిస్తాన్ని, అలా నమ్ముతున్న అక్కడి ప్రజలకు నెమ్మదిగా అసలు విషయాలు తెలిసి వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తో పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది చాలదన్నట్లుగా, బుధవారం-గురువారం రాత్రి సమయంలో భారత్పైకి క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడిని మన ‘‘ఎస్-400 సుదర్శన చక్ర’’ సమర్థవంతంగా అడ్డుకుంది.
అయితే, భారత్ దెబ్బ పాకిస్తాన్కి పడుతున్నా, నొప్పి మాత్రం చైనాకు కలుగుతోంది. ఎందుకంటే, భారత సైనిక పాటవాల ముందు చైనా రక్షణ వ్యవస్థలు ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిజానికి చైనా ఉత్పత్తులు అంటేనే చీప్ అనే వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం భారత్ దీనిని నిరూపిస్తోంది. భారత్, పాక్ ఘర్షణలో తాము ఎంత నష్టపోతున్నామనే విషయం చైనాకు తెలిసి వస్తోంది.
Also Read
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
Read Also: Operation Sindoor: ఏడవడం ఒక్కటే తక్కువ.. పాకిస్తాన్ పార్లమెంటులో ఎమోషనలైన ఎంపీ.. వీడియో వైరల్!
చైనా ఎయిర్ డిఫెన్స్, క్షిపణులు ధ్వంసం:
ముఖ్యంగా, చైనా తయారీ వ్యవస్థలు భారత్ దాడుల ముందు పనిచేయడం లేదు. చైనా తయారు చేసిన పాకిస్తాన్ HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థలు దాడుల సమయంలో అస్సలు పసిగట్టలేకపోయాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పీఓకే, పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లో 9 స్థావరాల్లో 24 దాడులు నిర్వహిస్తే ఒక్క క్షిపణిని కూడా గుర్తించి, అడ్డుకోలేకపోయింది.
ఇక, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్లోని 15 నగరాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ దాడుల్ని ఎస్-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుంది. ఈ దాడిలో పాక్ ఉపయోగించినవి చైనా మిస్సైల్స్ అని తేలింది. గురువారం ఉదయం భారత్ ఏకంగా లాహోర్లోని HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థని భారత్ ఇజ్రాయిల్ తయారీ క్షిపణులు ధ్వంసం చేశాయి.
ఈ పరిణామాలు చైనాకు మింగుడు పడటం లేదు. భారత దాడితో చైనా ఆయుధాల పనితీరును ప్రపంచానికి బహిర్గతం అయింది. రానున్న రోజుల్లో చైనా మిలిటరీ పరికరాలు, ఆయుధాలను పాకిస్తాన్ మినహా ఏ దేశం కూడా కొనే పరిస్థితి ఉండదు. ఇదిలా ఉంటే, భారత్ తన ఆకాష్ మిస్సైల్తో చైనా తయారీ జేఎఫ్ 17 యుద్ధ విమానాన్ని మన ఆకాష్ మిస్సైల్ కూల్చేసిందని తెలుస్తోంది. అయితే, దీనిపై పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేయకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఇది తెగ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!