Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
- అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సైన్యం సిద్ధం: ఆర్మీ చీఫ్
- NDA పాసింగ్ అవుట్ పరేడ్లో కీలక వ్యాఖ్యలు
- ఉగ్రవాదానికి భారత్ గట్టి సమాధానం ఇస్తుందని స్పష్టం
- హైబ్రిడ్ వార్, గ్రే జోన్ ముప్పులపై అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఖడక్వాస్లాలోని జాతీయ రక్షణ అకాడమీ (NDA)లో 150వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన మాట్లాడుతూ, పరోక్షంగా పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేశారు. 2025లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై భారీ దాడులు చేసి, ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
ద్వివేది ఆపరేషన్ సిందూర్పై మాట్లాడుతూ.. భారత్ సైనిక చర్యకు ఇది ఒక బెంచ్మార్క్గా నిలిచిందని అన్నారు. త్రివిధ దళాల సమన్వయానికి ఇది ఉదాహరణగా నిలిచిందని చెప్పారు. నేటి భద్రతా సవాళ్లు కేవలం యూనిఫాం రూపంలో సరిహద్దుల నుంచి రావని అన్నారు. గ్రే జోన్, హైబ్రిడ్ యుద్ధం, వేగవంతమైన ఆధునిక యుద్ధం వంటి వాటిని ఎదుర్కొనేటప్పుడు సైనికులు మరింత తీక్షణంగా ఆలోచించి వ్యవహరించాలని సూచించారు. భారతదేశం స్పందించినప్పుడు అది ఖచ్చితంగా, ప్రభావవంతంగా ఉంటుందని సిందూర్ నిరూపించిందని అన్నారు. 42 ఏళ్ల క్రితం తాను కూడా ఇక్కడి నుంచే పాస్ అవుట్ అయ్యానని చెప్పారు. ప్రస్తుతం తన కెరీర్ చివరి దశలో ఉందని, కొత్త క్యాడెట్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించారని అన్నారు.
Also Read
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
2025 మే నెలలో, భారతదేశం పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి చేసింది. పాకిస్తాన్తో పాటు పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలు, ట్రైనింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో వందలాది మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్పై పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నిస్తే, ఆ దేశానికి చెందిన వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
-
Samantha Pregnancy: ప్రతి దశ ఒకేలా ఉండదు.. బేబీ బంప్తో సమంత ఫోటోలు వైరల్!
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?