Operation Sindoor: మ్యాప్ మారుతుంది.. పాకిస్తాన్కు ముగ్గురి వార్నింగ్..
- పాకిస్తాన్కు ముగ్గురు కీలక అధికారుల వార్నింగ్..
- ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే మ్యాప్ మారిపోతుందని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పాకిస్తాన్కు ఒక రోజు వ్యవధిలో భారతదేశానికి చెందిన కీలక అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏదైనా సాహసోపేత చర్య పాల్పడొద్దని హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ లు పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారతీయ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి లేదా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే, ఆపరేషన్ సిందూర్ 2.0ను చూస్తారని హెచ్చరించారు. పుల్వామా లాంటి ఘటనలు జరిగితే ఆపరేషన్ సిందూర్ 2.0 జరగొచ్చు, దీనిలో పాకిస్తాన్ తన సైనిక స్థావరాలతో పాటు, భూభాగాన్ని కూడా కొల్పోతుంది అని అన్నారు.
Read Also: Russia: పాకిస్తాన్కు రష్యా ఇంజన్లు.. నిజం ఏంటంటే..
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ఈ హెచ్చరికలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రపంచదేశాల పర్యటనలో ఉన్న సమయంలో భారత్ నుంచి వచ్చాయి. ‘‘పాకిస్తాన్ సర్ క్రీక్ పై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే, సమాధానం చాలా బలంగా ఉంటుంది. అది పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మారుస్తుంది’’ అని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. భారతసైన్యం 1965 యుద్ధంలో లాహోర్ ను చేరుకుందని, ఇప్పుడు కరాచీపై దాడి జరుగుతుందని అన్నారు.
దీని తర్వాత, అక్టోబర్ 3న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. ఈసారి భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉందని, ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో ఉన్నట్లు సంయమనంతో ఉండబోమని చెప్పింది. భారత్ ఈ సారి పూర్తిగా సిద్ధంగా ఉందని, ఇది పాకిస్తాన్ మ్యాప్ను మారుస్తుందని హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని హెచ్చరించారు. అదే రోజు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను, దాదాపు 12 పాకిస్తాన్ విమానాలు, కమాండ్ పోస్టులు, ఎయిర్ ఫీల్డ్లు, రాడార్ సైట్లను కోల్పో్యిందని చెప్పారు.
తాజావార్తలు
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!