Operation Sindoor: మ్యాప్ మారుతుంది.. పాకిస్తాన్కు ముగ్గురి వార్నింగ్..
- పాకిస్తాన్కు ముగ్గురు కీలక అధికారుల వార్నింగ్..
- ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే మ్యాప్ మారిపోతుందని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పాకిస్తాన్కు ఒక రోజు వ్యవధిలో భారతదేశానికి చెందిన కీలక అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏదైనా సాహసోపేత చర్య పాల్పడొద్దని హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ లు పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారతీయ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి లేదా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే, ఆపరేషన్ సిందూర్ 2.0ను చూస్తారని హెచ్చరించారు. పుల్వామా లాంటి ఘటనలు జరిగితే ఆపరేషన్ సిందూర్ 2.0 జరగొచ్చు, దీనిలో పాకిస్తాన్ తన సైనిక స్థావరాలతో పాటు, భూభాగాన్ని కూడా కొల్పోతుంది అని అన్నారు.
Read Also: Russia: పాకిస్తాన్కు రష్యా ఇంజన్లు.. నిజం ఏంటంటే..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ఈ హెచ్చరికలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రపంచదేశాల పర్యటనలో ఉన్న సమయంలో భారత్ నుంచి వచ్చాయి. ‘‘పాకిస్తాన్ సర్ క్రీక్ పై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే, సమాధానం చాలా బలంగా ఉంటుంది. అది పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మారుస్తుంది’’ అని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. భారతసైన్యం 1965 యుద్ధంలో లాహోర్ ను చేరుకుందని, ఇప్పుడు కరాచీపై దాడి జరుగుతుందని అన్నారు.
దీని తర్వాత, అక్టోబర్ 3న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. ఈసారి భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉందని, ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో ఉన్నట్లు సంయమనంతో ఉండబోమని చెప్పింది. భారత్ ఈ సారి పూర్తిగా సిద్ధంగా ఉందని, ఇది పాకిస్తాన్ మ్యాప్ను మారుస్తుందని హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని హెచ్చరించారు. అదే రోజు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను, దాదాపు 12 పాకిస్తాన్ విమానాలు, కమాండ్ పోస్టులు, ఎయిర్ ఫీల్డ్లు, రాడార్ సైట్లను కోల్పో్యిందని చెప్పారు.
తాజావార్తలు
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!