Arvind Kejriwal: ‘‘ఆపరేషన్ ఝాదూ’’.. ఆప్ని అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. స్వాతి మలివాల్పై అతని సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశాడు. ఈ కేసులో నిన్న బిభవ్ కుమార్ అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాడు. ఆప్ నేతలు, కార్యకర్తలు అందరం వస్తామని, అందర్ని ఒకటేసారి అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఈ రోజు మార్చ్ చేయడానికి ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ఎవరినైనా జైలుకు పంపొచ్చని, ఆప్ని బీజేపీ ముప్పుగా చూస్తోందని ‘‘ఆపరేషన్ ఝాదూ’’ అని, తన పార్టీని అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయాలని ప్రధాని భావిస్తున్నాడు’’ అని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా ప్రముఖ ఆప్ నేతల్ని అరెస్ట్ చేయడం, పార్టీ బ్యాంకు ఖాతాల్ని స్వాధీనం చేసుకోవడం వంటి ఉన్నాయని చెప్పారు. వారి ఆపరేషన్ ఝాదూ కొనసాగుతోందని, నాకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ప్రధాని ఆప్ గురించి మాట్లాడటం మానలేదని అన్నారు. ఆప్ గురించి దేశం మాట్లాడుతోందని, బీజేపీకి ముప్పు ఏర్పడుతుందని తమను అణగదొక్కాలని చూస్తున్నారని అన్నారు.
ఆప్ నేత స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్ తర్వాత, కేజ్రీవాల్ నిన్న మాట్లాడుతూ.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్లతో సహా మరిన్ని అరెస్టులకు ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతల్ని వివిధ ఆరోపణలపై జైలుకు పంపడం ద్వారా ప్రధాని ఒక క్రమపద్ధతిలో తమను లక్ష్యం చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము ఉచిత విద్యుత్, నీటిని అందిస్తున్నామని, తాము నిజాయితీతో డబ్బును ఆదా చేస్తున్నామని ఇది బీజేపీకి నచ్చడం లేని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!