Supreme Court: “అత్తమామాలపై ప్రతీకారం కోసమే”.. వరకట్న వేధింపుల కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు..
Supreme Court: అత్తమామాలపై ఒక మహిళ దాఖలు చేసిన వరకట్న వేధింపుల కేసును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సదరు మహిళ తన అత్తామమాలపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేసిందని వ్యాఖ్యానించింది. మహిళ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని కొనసాగించడం అన్యాయానికి దారి తీస్తుందని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, సంజయ్ కుమార్, ఎస్విఎన్ భట్టిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
వాస్తవాలను, పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే సదరు మహిళ ఆమె అత్తామామలపై చేసిన ఆరోపణలు సరిపోవని ధర్మాసనం చెప్పింది. సదరు మహిళ స్పష్టంగా తన అత్తామామలపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది.. ఆమె ఆరోపణలు పూర్తిగా విచిత్రమైనవి, అసంభవమైనవిగా పేర్కొంది. మహిళ తన అత్తామామలు, బావపై విచారణ రద్దు చేసేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు నిరాకరించిన సమయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Read Also: Udhayanidhi Stalin: “మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ పిలుపునిచ్చినప్పుడు”.. సనాతన వ్యాఖ్యలపై ఉదయనిధి
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన సదరు మహిళ 2007లో వివాహం చేసుకుంది. అయితే ఆమె భర్త వివాహాన్ని రద్దు చేయాలని విడాకులకు అప్లై చేశాడు. భర్త విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి ముందు మహిళ తన భర్త, అత్తామామలపై అనేక ఆరోపణలు చేస్తూ పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 498A (ఒక మహిళను క్రూరత్వానికి గురిచేసిన భర్త లేదా భర్త బంధువు) మరియు వరకట్న నిషేధ చట్టం, 1961లోని సెక్షన్లు 3 మరియు 4 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన సుప్రీం.. వేర్వేరు నగరాల్లో నివసించే ఆమె బావ, అత్తమామాలు ఆమెను ఎలా కట్నం కోసం వేధించారని ప్రశ్నించింది. ఆమె ఆరోపణలు అసంబద్ధమైనవిగా ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 2009లో తన అత్తగారి ఇళ్లును వదిలిపెట్టిన మహిళ, ఆమె భర్త విడాకులకు ప్రక్రియను ప్రారంభించే ముందు 2013లో ఫిర్యాదు చేయడాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దీంతో ఆమె దాఖలు చేసిన వరకట్న వేధింపుల కేసును కొట్టేసింది.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!