Delhi: జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- ఈ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇటీవలే కేంద్రం ప్రకటన
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. కేంద్రమంత్రులు కూడా ప్రకటనలు చేశారు. అన్నట్టుగానే బుధవారం మోడీ నేతృత్వంలోని మంత్రివర్గం కోవింద్ నివేదికకు ఆమోదముద్ర వేసింది.
ఇది కూడా చదవండి: Jagdaur CHC: పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు చేశాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఇటీవలే కాంగ్రెస్, వామపక్షాలు స్పష్టం చేశాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని.. అందుకు లోక్సభలోనూ.. రాజ్యసభలోనూ మోడీ ప్రభుత్వానికి బలం లేదని స్పష్టంచేశాయి. కానీ కేంద్రం మాత్రం జమిలి వైపే మొగ్గుచూపుతోంది. దీనిపై విపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
జమిలి అంటే ఏంటి?
లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించడాన్ని జమిలి అంటారు. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలకు ఆయా సమయాల్లో జరుగుతున్నాయి. ఈసారి మాత్రం కొన్ని నెలలు గ్యాప్ ఉన్న రాష్ట్రాలను కూడా లోక్సభ ఎన్నికల దాకా పొడిగించవచ్చు. అందులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ అసెంబ్లీల గడువును పొడిగించి లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్రాలకు ఆపధర్మ ప్రభుత్వాన్ని నడపడానికి రాజ్యాంగంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే.. ఈ రాష్ట్రాల్లో కూడా లోక్సభతో పాటు నిర్వహించే ఛాన్సుంటుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!