PM Narendra Modi: ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు.. జీ 20 లోగో ఆవిష్కరించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘One Earth, One Family, One future’: PM Modi unveils India’s G20 mantra: వచ్చే ఏడాది భారతదేశం జీ-20 సమావేశాలకు ఆథిత్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన లోగోను, థీమ్ ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఆవిష్కరించారు. ‘‘ఒకే సూర్యుడు,ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ తో భారతదేశం పునరుత్పాదక ఇంధన విప్లవానికి నాయకత్వం వహించిందని.. భారతదేశం ఒక భూమి, ఒక ఆరోగ్యంతో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాన్ని బలోపేతం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు జీ 20 కోసం భారతదేశం థీమ్ ‘‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం 2023 జీ 20 సమావేశాలకు అధ్యక్ష బాధ్యత స్వీకరిస్తున్న సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. లోగోపై ‘వసుధైక కుటుంబం’ అనే వ్యాఖ్యాలను లోగోపై ఉంచారు. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి భారతదేశ సంస్కృతి, వారసత్వం, విశ్వాసాలను కమలం ప్రతిబింభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచాన్ని కోవిడ్-19 మహమ్మారి పరిణామాలను ఎదుర్కొంటోందని.. కమలం ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా వికసిస్తుందని.. ఆశల్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు.
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
Read Also: EAM S Jaishankar: భారత ప్రయోజనాలే ఫస్ట్.. రష్యా నుంచి ఆయిల్ కొంటాం..
లోగోలోని కమలానికి ఉన్న ఏడు రేకులు ప్రపంచంలోని ఏడు ఖండాలను సూచిస్తాయని.. జీ20 ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం అనంతరం భారతదేశం అభివృద్ధి వైపు ప్రయాణించడం ప్రారంభించిందని.. గత 75 ఏళ్లలో అన్ని ప్రభుత్వాల కృషి ుందని.. ప్రతీ ప్రభుత్వం, ప్రతీ పౌరుడు దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేశారని అన్నారు. భారతదేశం ప్రతీ కష్టాన్ని అనుభవంగా మార్చుకుందని అన్నారు. భారతదేశం తన నైపుణ్యాలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.
డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలను తీసుకోనుంది. జీ 20 ప్రపంచ జీడీపీలో 85 శాతాన్ని, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతాన్ని, జనాభాలో మూడింట రెండొంతులు కలిగి ఉంది. వచ్చే ఏడాది భారత్ లో నిర్వహించబోయే జీ20 సదస్సులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. దీంట్లో కాశ్మీర్ కూడా ఉంది. మొత్తం 32 విభిన్న రంగాలకు చెందిన 200 సమావేశాలను భారత్ నిర్వహించనుంది.
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!