PM Narendra Modi: ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు.. జీ 20 లోగో ఆవిష్కరించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘One Earth, One Family, One future’: PM Modi unveils India’s G20 mantra: వచ్చే ఏడాది భారతదేశం జీ-20 సమావేశాలకు ఆథిత్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన లోగోను, థీమ్ ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఆవిష్కరించారు. ‘‘ఒకే సూర్యుడు,ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ తో భారతదేశం పునరుత్పాదక ఇంధన విప్లవానికి నాయకత్వం వహించిందని.. భారతదేశం ఒక భూమి, ఒక ఆరోగ్యంతో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాన్ని బలోపేతం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు జీ 20 కోసం భారతదేశం థీమ్ ‘‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం 2023 జీ 20 సమావేశాలకు అధ్యక్ష బాధ్యత స్వీకరిస్తున్న సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. లోగోపై ‘వసుధైక కుటుంబం’ అనే వ్యాఖ్యాలను లోగోపై ఉంచారు. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి భారతదేశ సంస్కృతి, వారసత్వం, విశ్వాసాలను కమలం ప్రతిబింభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచాన్ని కోవిడ్-19 మహమ్మారి పరిణామాలను ఎదుర్కొంటోందని.. కమలం ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా వికసిస్తుందని.. ఆశల్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు.
Also Read
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
Read Also: EAM S Jaishankar: భారత ప్రయోజనాలే ఫస్ట్.. రష్యా నుంచి ఆయిల్ కొంటాం..
లోగోలోని కమలానికి ఉన్న ఏడు రేకులు ప్రపంచంలోని ఏడు ఖండాలను సూచిస్తాయని.. జీ20 ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం అనంతరం భారతదేశం అభివృద్ధి వైపు ప్రయాణించడం ప్రారంభించిందని.. గత 75 ఏళ్లలో అన్ని ప్రభుత్వాల కృషి ుందని.. ప్రతీ ప్రభుత్వం, ప్రతీ పౌరుడు దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేశారని అన్నారు. భారతదేశం ప్రతీ కష్టాన్ని అనుభవంగా మార్చుకుందని అన్నారు. భారతదేశం తన నైపుణ్యాలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.
డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలను తీసుకోనుంది. జీ 20 ప్రపంచ జీడీపీలో 85 శాతాన్ని, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతాన్ని, జనాభాలో మూడింట రెండొంతులు కలిగి ఉంది. వచ్చే ఏడాది భారత్ లో నిర్వహించబోయే జీ20 సదస్సులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. దీంట్లో కాశ్మీర్ కూడా ఉంది. మొత్తం 32 విభిన్న రంగాలకు చెందిన 200 సమావేశాలను భారత్ నిర్వహించనుంది.
తాజావార్తలు
-
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
-
UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ