PM Narendra Modi: ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు.. జీ 20 లోగో ఆవిష్కరించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘One Earth, One Family, One future’: PM Modi unveils India’s G20 mantra: వచ్చే ఏడాది భారతదేశం జీ-20 సమావేశాలకు ఆథిత్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన లోగోను, థీమ్ ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఆవిష్కరించారు. ‘‘ఒకే సూర్యుడు,ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ తో భారతదేశం పునరుత్పాదక ఇంధన విప్లవానికి నాయకత్వం వహించిందని.. భారతదేశం ఒక భూమి, ఒక ఆరోగ్యంతో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాన్ని బలోపేతం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు జీ 20 కోసం భారతదేశం థీమ్ ‘‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం 2023 జీ 20 సమావేశాలకు అధ్యక్ష బాధ్యత స్వీకరిస్తున్న సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. లోగోపై ‘వసుధైక కుటుంబం’ అనే వ్యాఖ్యాలను లోగోపై ఉంచారు. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి భారతదేశ సంస్కృతి, వారసత్వం, విశ్వాసాలను కమలం ప్రతిబింభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచాన్ని కోవిడ్-19 మహమ్మారి పరిణామాలను ఎదుర్కొంటోందని.. కమలం ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా వికసిస్తుందని.. ఆశల్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు.
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్లు వీరే!
Read Also: EAM S Jaishankar: భారత ప్రయోజనాలే ఫస్ట్.. రష్యా నుంచి ఆయిల్ కొంటాం..
లోగోలోని కమలానికి ఉన్న ఏడు రేకులు ప్రపంచంలోని ఏడు ఖండాలను సూచిస్తాయని.. జీ20 ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం అనంతరం భారతదేశం అభివృద్ధి వైపు ప్రయాణించడం ప్రారంభించిందని.. గత 75 ఏళ్లలో అన్ని ప్రభుత్వాల కృషి ుందని.. ప్రతీ ప్రభుత్వం, ప్రతీ పౌరుడు దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేశారని అన్నారు. భారతదేశం ప్రతీ కష్టాన్ని అనుభవంగా మార్చుకుందని అన్నారు. భారతదేశం తన నైపుణ్యాలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.
డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలను తీసుకోనుంది. జీ 20 ప్రపంచ జీడీపీలో 85 శాతాన్ని, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతాన్ని, జనాభాలో మూడింట రెండొంతులు కలిగి ఉంది. వచ్చే ఏడాది భారత్ లో నిర్వహించబోయే జీ20 సదస్సులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. దీంట్లో కాశ్మీర్ కూడా ఉంది. మొత్తం 32 విభిన్న రంగాలకు చెందిన 200 సమావేశాలను భారత్ నిర్వహించనుంది.
తాజావార్తలు
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..