COVID 19: కొత్త వేరియంట్ కలకలం.. భారత్లో తొలి కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది.. భారత్లో మరి కొత్త వేరియంట్ కేసు నమోదు అయ్యింది.. కోవిడ్ ఎక్స్ఈ వేరియంట్కు సంబంధించిన తొలి కేసు భారత్లో వెలుగుచూసినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్(ఐఎన్ఎస్ఏసీవోజీ), సార్స్ సీవోవీ2 వైరస్కు చెందిన బులిటెన్ను విడుదల చేసింది.. అయితే, భారత్లో నమోదైన తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు ఎక్కడ వెలుగు చూసింది అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక, గత వారంతో పోలిస్తే, 12 రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తుండగా.. 19 రాష్ట్రాల్లో మాత్రం కేసులు తగ్గాయి..
మరోవైపు, అనుమానిత రీకాంబినెంట్ స్వీక్వెన్సింగ్కు సంబంధించిన తదుపరి విశ్లేషణలో ఉన్నాయని బులెటిన్లో పేర్కొన్నారు.. BA.2.10, BA.2.12 , BA.2 సబ్ లీనియేజ్లను డిటెక్ట్ చేశామని, అయితే వాటి వ్యాధి తీవ్రత గుర్తించలేదని బులిటెన్లో తెలిపారు. అయితే, భారత్లో ఇప్పటి వరకు ఎక్స్ఈ క్లస్టర్ నివేదికలు లేవు.. ఏప్రిల్ 18 బులెటిన్లో, ఐఎన్ఎస్ఏసీవోజీ దేశంలో ఒక ఎక్స్ఈ వేరియంట్ కేసును ప్రస్తావించింది. కానీ, ఇప్పుడు నిర్ధారణ జరిగింది. ఇక, అప్రమత్తమైన ప్రభుత్వం.. ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల నుండి నమూనాలను సేకరించడం ద్వారా దేశవ్యాప్తంగా ఎస్ఏఆర్ఎస్-CoV-2 యొక్క జన్యుపరమైన నిఘాను నివేదిస్తుంది. తాజా, బులెటిన్ ప్రకారం, INSACOG మొత్తం 2,43,957 నమూనాలను పరిశీలించింది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!