One Charger For All Gadgets: తీరనున్న కష్టాలు..! అన్ని రకాల గాడ్జెట్స్కు ఒకే ఛార్జర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇల్లు వదిలి ఏదైనా కొత్త చోటికి వెళ్లినా.. గ్రామానికి వెళ్లినా.. మరో ప్రాంతానికి వెళ్లినా.. తమ దగ్గర ఉన్న గాడ్జెట్స్కు సంబంధించిన ఛార్జర్ను క్యారీ చేయడం తప్పనిసరి అయ్యింది.. ఎందకంటే.. తమ గాడ్జెట్కు సంబంధించిన ఛార్జర్ అక్కడ ఉంటుందో..? లేదో..? అనే సందేహాం.. అయితే.. ఆ కష్టాలు మాత్రం త్వరలోనే తీరిపోనున్నాయి.. ఎందుకంటే.. కొత్త ఎలక్ట్రానిక్ పరికరం తీసుకున్న ప్రతిసారీ, దానికి పనికొచ్చే మరో రకం చార్జర్ను కొత్తగా కొనాల్సిన పనిని తప్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైన వివిధ పరికరాలన్నింటికీ కామన్గా ఒకే చార్జర్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
Read Also: Wednesday Special Sri Ganesha Sahasranama Stotram Live: ఈ రోజు ఇంట్లో ఈ స్తోత్రం వింటే చాలు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
స్మార్ట్ఫోన్లు మరియు టాబ్లెట్లతో సహా వివిధ రకాల పరికరాల కోసం సాధారణ ఛార్జర్.. అంటే ఒకే రకమైన ఛార్జర్ను తీసుకొచ్చేలా ప్రభుత్వం అన్వేషిస్తోంది.. దీనిపై చర్చించడానికి ఆగస్టు 17న సమావేశం నిర్వహించనున్నట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. మొబైల్ తయారీదారులు మరియు ఆ రంగంలోని నిర్దిష్ట సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నారు.. బహుళ ఛార్జర్ల వినియోగానికి ముగింపు పలికే అవకాశాలపై చర్చించనున్నారు.. ఇది అమల్లోకి వస్తే ఈ-వ్యర్థాలను నిరోధించడంతో పాటు వినియోగదారులపై భారాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.. మొత్తంగా 2024 నాటికి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ యూఎస్బీ–సీ పోర్ట్ తరహా చార్జర్ల వినియోగాన్ని అమల్లోకి తేనున్నట్లు యూరోపియన్ యూనియన్ ఇటీవలే ప్రకటించింది. అమెరికాలో కూడా ఇలాంటి డిమాండే ఉన్న విషయం తెలిసిందే..
ఆయా కంపెనీలు యూరప్ మరియు యుఎస్లో అన్ని గాడ్జెట్స్ కోసం ఒకే ఛార్జర్ చేయగలిగితే, వారు భారతదేశంలో ఎందుకు చేయలేరు? స్మార్ట్ఫోన్లు మరియు టాబ్లెట్ల వంటి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలకు సాధారణ ఛార్జర్ ఉండాలి కదా? అని ఓ అధికారి ప్రశ్నించారు. భారతదేశం ఈ మార్పు కోసం ఒత్తిడి చేయకపోతే, అటువంటి ఉత్పత్తులు ఇక్కడ డంప్ చేయబడవచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే, గతంతో పోలిస్తే.. ఇప్పటికే చార్జర్ల బెడద కొంత తగ్గిందా…? అయినా మీ దగ్గర సీ టైప్ ఉందా? నార్మల్ చార్జర్ ఉందా? అనే అడివారు ఇప్పటికీ ఉన్నారు.. కానీ, త్వరలోనే ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయన్నమాట.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!