Corona : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 23 మంది విద్యార్థులకు పాజిటివ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి మళ్లీ రెక్కలు చాస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా.. ఇప్పుడు మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది. యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడి తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ సృష్టించిన కరోనా.. ఇప్పుడు మరోసారి దేశంలో విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ నోయిడాలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో 53 కరోనా కేసులు నోయిడాలో నమోదయ్యాయి.
అయితే ఈ కేసులు ఎక్కువగా పాఠశాలల్లో నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం అయితే మొత్తం నాలుగు స్కూల్లలోని 23 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దీంతో ఫస్ట్, ప్రైమరీ కాంటాక్టులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా ఘజియాబాద్ స్కూల్లో 13 ఏండ్ల విద్యార్థికి కరోనా సోకింది. నోయిడాలోని సెక్టార్ 40లోని ప్రైవేట్ స్కూల్లో 13 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్గా వచ్చింది.
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
దీంతో ఘజియాబాద్, నోయిడాలో పలు ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రెండు రోజుల పాటు భౌతిక తరగతులను రద్దు చేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. చైనాలో సైతం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో అతిపెద్ద నగరమైన శాంఘై సిటీలో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. అంతేకాకుండా ఒమిక్రాన్ వేరియంట్లోని ఎల్452ఆర్ మ్యుటేషన్ కేసులు ఇప్పటికే భారత్లో నమోదవుతుండడం గమనార్హం.
తాజావార్తలు
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..