Odisha: స్నేహితులతో కలిసి సోదరిని అత్యాచారం చేసిన కామాంధుడు.. గొడ్డలితో నరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల చట్టాలను తీసుకొని వస్తున్నారు.. అయిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. సొంతవాళ్ళే రాబంధులగా మారి జీవితాలను నాశనం చేస్తున్నారు.. తాజాగా అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది.. సొంత సోదరి అని మర్చిపోయి కామంతో రెచ్చిపోయాడు ఓ దుర్మార్గుడు.. వావి వరుసలు కూడా మరచి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది..ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, తన సోదరిని గ్యాంగ్ రేప్ చేశాడు. అనంతరం ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు..
వివరాల్లోకి వెళితే.. ఒడిశా కంథమాల్ జిల్లాలోని చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిథిలో.. నవంబర్ 3న జరిగింది ఈ ఘటన. నేరస్థులను పోలీసులు పట్టుకోవడంతో, ఈ వార్త బయటకు వచ్చింది. కొన్ని నెలల క్రితం.. స్థానికంగా నివాసముండే 25ఏళ్ల మహిళకు తన సోదరుడితో గొడవ జరిగింది. తన భర్త సోదరితో, అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో.. సోదరుడిని మందలించింది. ఆమెకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. లేకపోతే అందరికి చెప్పేస్తానని బెదిరించింది. కానీ ఆ వ్యక్తి, సోదరి మాట వినలేదు. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది..
Also Read
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
దాంతో కోపంతో రగిలిపోయిన అతను ఆమె అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.. నవంబర్ 3న మహిళ.. పని మీద అడవుల్లోకి వెళ్లింది. ఆమె, ఆరోజున, అక్కడకి వస్తుందని ముందే తెలుసుకున్న ఆ మహిళ సోదరుడు.. తన నలుగురు స్నేహితులను పిలిపించాడు. వారి చేత మద్యం తాగించాడు. ఆమె కనిపించేసరికి.. వారందరు మహిళపై పడ్డారు. తొలుత.. ఆ వ్యక్తి, తన సోదరిని రేప్ చేశాడు. అనంతరం.. స్నేహితుల చేత రేప్ చేయించాడు. మహిళ గట్టిగా అరుస్తోందని.. ఆమె గొంతు నులిమాడు. అక్కడితో ఆగకుండా.. గొడ్డలితో నరికాడు. ఆమె అక్కడిక్కడ ప్రాణాలు కోల్పోయింది..
మహిళ కనిపించలేదని కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా.. నవంబర్ 7, అడవుల్లో వారికి ఒక మహిళ మృతదేహం లభించింది. ఆమె తమ బిడ్డేనని, కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.. పోస్ట్ మార్టం చేసి గ్యాంగ్ రేప్ జరిగినట్లు నిర్దారించారు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల క్రితం ఆ దుర్మార్గుడు ని అరెస్ట్ చేశారు.. అతడి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు.. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతుంది..
- Tags
- Latest Crime News
- Odisha
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!