Odisha: స్నేహితులతో కలిసి సోదరిని అత్యాచారం చేసిన కామాంధుడు.. గొడ్డలితో నరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల చట్టాలను తీసుకొని వస్తున్నారు.. అయిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. సొంతవాళ్ళే రాబంధులగా మారి జీవితాలను నాశనం చేస్తున్నారు.. తాజాగా అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది.. సొంత సోదరి అని మర్చిపోయి కామంతో రెచ్చిపోయాడు ఓ దుర్మార్గుడు.. వావి వరుసలు కూడా మరచి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది..ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, తన సోదరిని గ్యాంగ్ రేప్ చేశాడు. అనంతరం ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు..
వివరాల్లోకి వెళితే.. ఒడిశా కంథమాల్ జిల్లాలోని చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిథిలో.. నవంబర్ 3న జరిగింది ఈ ఘటన. నేరస్థులను పోలీసులు పట్టుకోవడంతో, ఈ వార్త బయటకు వచ్చింది. కొన్ని నెలల క్రితం.. స్థానికంగా నివాసముండే 25ఏళ్ల మహిళకు తన సోదరుడితో గొడవ జరిగింది. తన భర్త సోదరితో, అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో.. సోదరుడిని మందలించింది. ఆమెకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. లేకపోతే అందరికి చెప్పేస్తానని బెదిరించింది. కానీ ఆ వ్యక్తి, సోదరి మాట వినలేదు. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది..
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
దాంతో కోపంతో రగిలిపోయిన అతను ఆమె అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.. నవంబర్ 3న మహిళ.. పని మీద అడవుల్లోకి వెళ్లింది. ఆమె, ఆరోజున, అక్కడకి వస్తుందని ముందే తెలుసుకున్న ఆ మహిళ సోదరుడు.. తన నలుగురు స్నేహితులను పిలిపించాడు. వారి చేత మద్యం తాగించాడు. ఆమె కనిపించేసరికి.. వారందరు మహిళపై పడ్డారు. తొలుత.. ఆ వ్యక్తి, తన సోదరిని రేప్ చేశాడు. అనంతరం.. స్నేహితుల చేత రేప్ చేయించాడు. మహిళ గట్టిగా అరుస్తోందని.. ఆమె గొంతు నులిమాడు. అక్కడితో ఆగకుండా.. గొడ్డలితో నరికాడు. ఆమె అక్కడిక్కడ ప్రాణాలు కోల్పోయింది..
మహిళ కనిపించలేదని కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా.. నవంబర్ 7, అడవుల్లో వారికి ఒక మహిళ మృతదేహం లభించింది. ఆమె తమ బిడ్డేనని, కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.. పోస్ట్ మార్టం చేసి గ్యాంగ్ రేప్ జరిగినట్లు నిర్దారించారు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల క్రితం ఆ దుర్మార్గుడు ని అరెస్ట్ చేశారు.. అతడి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు.. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతుంది..
- Tags
- Latest Crime News
- Odisha
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!