Odisha: స్నేహితులతో కలిసి సోదరిని అత్యాచారం చేసిన కామాంధుడు.. గొడ్డలితో నరికి..
మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల చట్టాలను తీసుకొని వస్తున్నారు.. అయిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. సొంతవాళ్ళే రాబంధులగా మారి జీవితాలను నాశనం చేస్తున్నారు.. తాజాగా అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది.. సొంత సోదరి అని మర్చిపోయి కామంతో రెచ్చిపోయాడు ఓ దుర్మార్గుడు.. వావి వరుసలు కూడా మరచి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది..ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, తన సోదరిని గ్యాంగ్ రేప్ చేశాడు. అనంతరం ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు..
వివరాల్లోకి వెళితే.. ఒడిశా కంథమాల్ జిల్లాలోని చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిథిలో.. నవంబర్ 3న జరిగింది ఈ ఘటన. నేరస్థులను పోలీసులు పట్టుకోవడంతో, ఈ వార్త బయటకు వచ్చింది. కొన్ని నెలల క్రితం.. స్థానికంగా నివాసముండే 25ఏళ్ల మహిళకు తన సోదరుడితో గొడవ జరిగింది. తన భర్త సోదరితో, అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో.. సోదరుడిని మందలించింది. ఆమెకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. లేకపోతే అందరికి చెప్పేస్తానని బెదిరించింది. కానీ ఆ వ్యక్తి, సోదరి మాట వినలేదు. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది..
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
దాంతో కోపంతో రగిలిపోయిన అతను ఆమె అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.. నవంబర్ 3న మహిళ.. పని మీద అడవుల్లోకి వెళ్లింది. ఆమె, ఆరోజున, అక్కడకి వస్తుందని ముందే తెలుసుకున్న ఆ మహిళ సోదరుడు.. తన నలుగురు స్నేహితులను పిలిపించాడు. వారి చేత మద్యం తాగించాడు. ఆమె కనిపించేసరికి.. వారందరు మహిళపై పడ్డారు. తొలుత.. ఆ వ్యక్తి, తన సోదరిని రేప్ చేశాడు. అనంతరం.. స్నేహితుల చేత రేప్ చేయించాడు. మహిళ గట్టిగా అరుస్తోందని.. ఆమె గొంతు నులిమాడు. అక్కడితో ఆగకుండా.. గొడ్డలితో నరికాడు. ఆమె అక్కడిక్కడ ప్రాణాలు కోల్పోయింది..
మహిళ కనిపించలేదని కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా.. నవంబర్ 7, అడవుల్లో వారికి ఒక మహిళ మృతదేహం లభించింది. ఆమె తమ బిడ్డేనని, కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.. పోస్ట్ మార్టం చేసి గ్యాంగ్ రేప్ జరిగినట్లు నిర్దారించారు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల క్రితం ఆ దుర్మార్గుడు ని అరెస్ట్ చేశారు.. అతడి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు.. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతుంది..
- Tags
- Latest Crime News
- Odisha
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?