Athletes Travel At Train Toilets: అమానవీయ ఘటన.. టాయిలెట్స్ దగ్గర కూర్చుని ప్రయాణించిన అథ్లెట్లు
- ఉత్తర ప్రదేశ్ లో 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ చాంఫియన్ షిప్ పోటీలు
- పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన 10 మంది బాలురు, 8 మంది బాలికలు
- టాయిలెట్ల దగ్గర కూర్చుని ప్రయాణించిన ఒడిశాకు చెందిన 18 మంది అథ్లెట్లు
ఉత్తర ప్రదేశ్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. టికెట్లు ధృవీకరణ కాకపోవడంతో ఒడిశాకు చెందిన 18 మంది అథ్లెట్లు రైలులోని టాయిలెట్ల సమీపంలో కూర్చుని ప్రయాణించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్లో నిర్వహించిన 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఒడిశా నుంచి 10 మంది బాలురు, 8 మంది బాలికలు కలిపి మొత్తం 18 మంది అథ్లెట్లు బయలుదేరారు. అయితే తిరుగు ప్రయాణానికి అవసరమైన ధృవీకరించబడిన రైలు టికెట్లు అందుబాటులో లేకపోవడంతో, వారు జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో అథ్లెట్లు తమ లగేజీతో కలిసి రైలు టాయిలెట్ల వెలుపల ఇరుక్కుని, స్టీల్ ఫ్లోర్పై చలిలో కూర్చుని ప్రయాణించాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది.
Also Read
ఈ విషయంపై ఒడిశా స్కూల్ మరియు సామూహిక విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతి ప్రసాద్ పరిదా స్పందిస్తూ, తిరుగు ప్రయాణానికి కేవలం నలుగురు అథ్లెట్లకే టికెట్లు ధృవీకరించబడ్డాయని తెలిపారు. అయితే.. మిగిలిన అథ్లెట్లు ఈ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, టాయిలెట్ సమీపంలో కూర్చుని ప్రయాణించడం తమకు మానసిక, శారీరక ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్నారు.
ఒడిశా స్పోర్ట్స్ అథారిటీకి చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ఘటనను “నిర్వహణ లోపం”గా అభివర్ణించారు. తిరుగు ప్రయాణానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే అథ్లెట్లు అదే దయనీయ స్థితిలో తిరిగి రావాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన క్రీడాకారుల భద్రత, గౌరవంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Student athletes return from UP by sitting next to toilets as Govt fails to provide them confirmed tickets. They went to UP under similar circumstances to participate in a sports meet. My story in @timesofindia today. https://t.co/6wm6JYBteu pic.twitter.com/LyzWhfPC9k
— Dianna Sahu (@DiannaSahu) December 23, 2025
తాజావార్తలు
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?