CM Conrad Sangma: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Conrad Sangma: రాబోయే 2023 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా శనివారం ప్రకటించారు. దేశ రాజధానిలో జరిగిన పార్టీ జాతీయ సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు.”మేఘాలయలోనే కాకుండా నాగాలాండ్, త్రిపురతో సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలలో కూడా తాము ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాము” అని సంగ్మా చెప్పారు. “మా స్టాండ్ 2018లో ఉన్నదానికంటే భిన్నంగా లేదు. అప్పుడు కూడా మేము ఒంటరిగా ఉన్నాము. బీజేపీతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్నాము. ఒక పార్టీగా మన ప్రజల, మన రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆకాంక్షల కోసం పని చేయాలి” అని మేఘాలయ ముఖ్యమంత్రి జోడించారు.
PM Narendra Modi: అటల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
చాలా తక్కువ సమయంలో రాష్ట్ర ఎన్నికలు జరగడం తమకు పెద్ద సవాల్ అని కాన్రాడ్ సంగ్మా అన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం వల్ల ఎన్డీయేపై ఉన్న అవగాహనపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన వెల్లడించారు. ఎన్డీయేతో రాజకీయంగానూ, సమస్యలపైనా తమకు అవగాహన ఉందన్నారు. కానీ కొన్ని అంశాల్లో కూడా రాజకీయంగా వారితో పొత్తు పెట్టుకోలేదని.. తమ స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పామన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీపీ 20 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 21 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ), పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, రెండు స్వతంత్ర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది నవంబర్లో ముకుల్ సంగ్మా, మరో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మమతా బెనర్జీ పార్టీ బెంగాల్ దాటి తన స్థావరాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నందున 17 మంది పార్టీ శాసనసభ్యులలో 12 మంది టీఎంసీలో చేరారు. ఈ సారి ఎన్నికలు జరిగితే టీఎంసీకి, ఎన్పీపీకి మధ్య పోటీ నెలకొననుంది.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!