CM Conrad Sangma: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Conrad Sangma: రాబోయే 2023 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా శనివారం ప్రకటించారు. దేశ రాజధానిలో జరిగిన పార్టీ జాతీయ సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు.”మేఘాలయలోనే కాకుండా నాగాలాండ్, త్రిపురతో సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలలో కూడా తాము ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాము” అని సంగ్మా చెప్పారు. “మా స్టాండ్ 2018లో ఉన్నదానికంటే భిన్నంగా లేదు. అప్పుడు కూడా మేము ఒంటరిగా ఉన్నాము. బీజేపీతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్నాము. ఒక పార్టీగా మన ప్రజల, మన రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆకాంక్షల కోసం పని చేయాలి” అని మేఘాలయ ముఖ్యమంత్రి జోడించారు.
PM Narendra Modi: అటల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
చాలా తక్కువ సమయంలో రాష్ట్ర ఎన్నికలు జరగడం తమకు పెద్ద సవాల్ అని కాన్రాడ్ సంగ్మా అన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం వల్ల ఎన్డీయేపై ఉన్న అవగాహనపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన వెల్లడించారు. ఎన్డీయేతో రాజకీయంగానూ, సమస్యలపైనా తమకు అవగాహన ఉందన్నారు. కానీ కొన్ని అంశాల్లో కూడా రాజకీయంగా వారితో పొత్తు పెట్టుకోలేదని.. తమ స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పామన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీపీ 20 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 21 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ), పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, రెండు స్వతంత్ర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది నవంబర్లో ముకుల్ సంగ్మా, మరో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మమతా బెనర్జీ పార్టీ బెంగాల్ దాటి తన స్థావరాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నందున 17 మంది పార్టీ శాసనసభ్యులలో 12 మంది టీఎంసీలో చేరారు. ఈ సారి ఎన్నికలు జరిగితే టీఎంసీకి, ఎన్పీపీకి మధ్య పోటీ నెలకొననుంది.
తాజావార్తలు
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!