UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!
- ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్..
- త్వరలోనే ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ను తొలగించే ఛాన్స్..
- సైబర్ మోసాలు పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Payments: మీరు యూపీఐ యాప్లు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ మార్పుల గురించి తప్పక మీరు తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి యూపీఐలోని పర్సన్-టు-పర్సన్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ ఫీచర్ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి డబ్బు అడగడానికి, బిల్లులు షేర్ చేసుకోవడానికి ఉపయోగపడేది. కానీ, ఇటీవల సైబర్ మోసగాళ్లు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో నకిలీ పేమెంట్ రిక్వెస్ట్లు పంపి, వినియోగదారులకు తెలియకుండానే లావాదేవీలు జరుపుతున్నారు.
Read Also: Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. బడా నిర్మాత సంచలన కామెంట్స్!
Also Read
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
ఇక, NPCI ఇప్పటికే ట్రాన్సాక్షన్ పరిమితిని రూ. 2 వేలకు తగ్గించినప్పటికీ, మోసాలు తగ్గకపోవడంతో.. కస్టమర్ల భద్రత కోసం, యూపీఐపై నమ్మకాన్ని కాపాడుకునేందుకు ఈ ఫీచర్ను దశలవారీగా నిలిపివేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఐఆర్సిటిసి లాంటి ప్లాట్ఫారమ్లు ఉపయోగించే మెర్చంట్ కలెక్ట్ రిక్వెస్ట్లు మాత్రం కొనసాగుతుందని వెల్లడించింది. వీటికి వినియోగదారుల ఆమోదం, యూపీఐ పిన్ తప్పనిసరి చేసింది.
Read Also: Alaska sale history: అమెరికాకు అలస్కా బేరం.. ఎంతకు అమ్మారంటే..?
అయితే, ఇక నుంచి మీరు డబ్బులు పంపించాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి, లేదా రిసీవర్ యూపీఐ ఐడీ / ఫోన్ నెంబర్ నమోదు చేసి, పిన్ ద్వారా లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కాగా, అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్లీజ్ పే మీ రిక్వెస్ట్ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండదు. అయితే, వినియోగదారులు ఈ మార్పులను గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. ముఖ్యంగా, మీ ఫోన్ను ఇతరులకు ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకంటే అది మోసాలకు దారి తీసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?