Fastag Scam: స్మార్ట్ వాచీతో ఫాస్టాగ్ స్కామ్.. క్లారిటీ ఇచ్చిన ఎన్పీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ఈ వీడియో ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్టాగ్ స్టిక్కర్లను స్మార్ట్ వాచ్ ల ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారన్నది ఈ వీడియో సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను గమనిస్తే రద్దీ సిగ్నల్ వద్ద కార్ విండ్ షీల్డ్ ను తుడుస్తున్నట్టు చేస్తున్న ఓ కుర్రాడి చేతికి డిజిటల్ వాచ్ తరహాలో ఓ పరికరం ఉంది. అయితే తను అద్దాలు తుడుస్తున్న సమయంలో ఆ స్మార్ట్ వాచ్ ద్వారా ఫాస్టాగ్ స్టిక్కర్ ని స్కాన్ చేస్తున్నట్లు గమనించిన యజమాని అతన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. కుర్రాడు పారిపోతాడు. అయితే దీనిపై సదరు కార్ ఓనర్ ఫాస్టాగ్ స్కామ్ జరుగుతున్నట్లు చెప్పడం వైరల్ అవుతున్న వీడియోలో ఉంది.
వైరల్ వీడియోపై ఎన్పీసీఐ క్లారిటీ:
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఇంటర్నెట్ లో తెగవైరల్ అవుతున్న వీడియోపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియో ఫేక్ గా తేల్చింది. ఎన్ఈటీసీ ఫాస్టాగ్ ఎకో సిస్టమ్ అనేది ఎన్ పీసీఐ, అక్వైరర్ బ్యాంక్, ఇష్యూ బ్యాంక్, టోల్ ప్లాజా ఈ నాలుగింటి మధ్య లావాదేవీల కోసమే నిర్మించారని.. లావాదేవీలకు ఎండ్ టూ ఎండ్ భద్రతా ప్రోటోకాల్ ఉందని తెలిపింది. ఫాస్టాగ్ పర్సన్ టూ మర్చంట్ లావాదేవీల కోసమే పని చేస్తుందని వెల్లడించింది. ఫాస్టాగ్ నెట్ వర్క్ ద్వారా పర్సన్ టూ పర్సన్ లావాదేవీలు వీలు కావని క్లారిటీ ఇచ్చింది. ఒక వ్యక్తి ఫాస్టాగ్ లో ఉన్న డబ్బులను పొందలేరని దీంతో స్కాంకు ఆస్కారం లేదని వెల్లడించింది. వినియోగదారుడు టోల్ ప్లాజాల్లోనే చెల్లింపులు చేసేలా మాత్రమే ఫాస్టాగ్ ఉపయోగపడుతుందని తెలిపింది.
వినియోగదారుడు, బ్యాంకుల మధ్య లావాదేవీలు అనుమతించిన ఐపీ అడ్రస్, యూఆర్ఎల్ వైట్ లిస్టింగ్ చేయడం ద్వారా సురక్షితంగా ఉంటాయని తెలిపింది. టోల్ ప్లాజా సెంటర్ లో ఇన్ స్టాల్ చేసిన హార్డ్ వేర్, సెక్యురిటీ మాడ్యుల్ క్రిప్టోగ్రాఫికల్ గా భద్రపరచబడుతుందని ఎన్పీసీఐ తెలిపింది. ఓపెన్ ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు నిర్వహించబడవని ఎన్పీసీఐ క్లారిటీ ఇచ్చింది. దీనిపై పేటీఎం కూడా స్పందించింది. వీడియో చూపించినట్లు డిజిటల్ వాచ్ ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేయడం సాధ్యపడదని.. ఈ వీడియో ఫేక్ అని వివరణ ఇచ్చింది.
A #viral Video claims that devices like watches are being used to swipe the #Fastag on vehicles, leading to fraudulent deduction of money from prepaid wallets.#PIBFactCheck:
▶️ This Video is #FAKE
▶️ Such transactions are not possible
▶️ Each Toll Plaza has a unique code pic.twitter.com/n7p01AXF4A
— PIB Fact Check (@PIBFactCheck) June 25, 2022
తాజావార్తలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!