Yogi Adityanath: సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏ మతానికి లేదు..
- సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏ మతానికి లేదు..
- హోలీ వేడుకల సందర్భంగా సీఎం యోగి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: హోలీ పండగ వేళ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం మాట్లాడుతూ.. సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరించారు. ప్రపంచంలో మరే దేశానికి లేదా మరే మతానికి ‘‘సనాతన ధర్మం’’ వంటి గొప్ప పండగలు, వేడుకల సంప్రదాయం లేదని ఆయన అన్నారు. గోవధదారులకు మద్దతు ఇచ్చిన వారు, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Ranya Rao : నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్.. రోజుకో కొత్త ట్విస్ట్!
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
‘‘”మమ్మల్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరు?” అని యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో జరిగిన సాంప్రదాయ ‘నర్సింగ్ శోభాయాత్ర’ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘వారు శ్రీరాముడిని, అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించిన వారే’’ అని అన్నారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ.. ‘‘వీరే గోవుల అక్రమ రవాణాలో పాల్గొంటారు, గోవధ చేసేవారికి ఆశ్రయం కల్పిస్తారు. వారిని అధికారంలో భాగస్వాములను చేస్తారు. భారత్ ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారదని చెప్పుకునేవారు కూడా వీరే’’ అన్నారు.
‘‘రాముడు మనకు మర్యాదగా, గౌరవ మార్గంలో నడవాలని నేర్పించాడు. మనం గౌరవంగా ముందుకు సాగినప్పుడు, మన పవిత్రతను ముందుకు తీసుకెళ్తాం. మేము లక్ష్మణ రేఖను ఎప్పుడూ ఉల్లంఘించము’’ అని అన్నారు. ప్రయాగ్ రాజ్లో జరిగిన మహాకుంభమేళ వేళ సనాతన ధర్మం, భారతదేశం రెండింటి సామర్థ్యాలను చూసినప్పుడు సనాతన వ్యతిరేకులకు తగిన సమాధానం లభించిందని అన్నారు. త్రివేణి సంగమం వద్ద 66 కోట్ల మంది భక్తులు కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సీఎం అన్నారు.
తాజావార్తలు
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి