Lok Sabha Elections 2024: హిడ్మా భయం.. బస్తర్ దండకారణ్యంలో ఈ గ్రామం నుంచి ఒక్కరు ఓటేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన బస్తన్ నియోజకవర్గానికి తొలిదశలో నిన్న ఎన్నికలు జరిగాయి. బీజాపూర్, కుంట, జగదల్పూర్, దంతేవాడ, సుక్మా వంటి ప్రాంతాలు బస్తర్ ఎంపీ స్థానంలో భాగంగా ఉన్నాయి. దండకారణ్యంతో కూడుకున్న ఈ ప్రాంతం మావోయిస్టులకు పెట్టని కోటలా ఉంటోంది. అయితే, నిన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం దండకారణ్యంలోని చాలా గ్రామాల్లోని ప్రజలు ఓటేసేందుకు ఉత్సాహం చూపించారు. ఓ వైపు ఎన్నికల్ని బహిష్కరించాలని మావోయిస్టులు ఇచ్చిన హెచ్చరికల్ని ఖాతరు చేయలేదు.
అయితే, ఒక్క గ్రామం మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. హార్ట్ కోర్ మావోయిస్టు నాయకుడిగా, మావోయిస్టు వ్యూహకర్తగా పేరున్న హిడ్మా సొంతూరు లోని ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ గ్రామం నుంచి ఒక్కరూ కూడా ఓటేయడానికి రాలేదు. బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఉన్న సుక్మా జిల్లా పరిధి కిందకు వచ్చే పువర్తి గ్రామంలో ప్రజలు ఓటేయలేదు. అనేక భయంకరమైన దాడులకు హిడ్మా పథక రచన చేసి, అమలు చేశాడనే పేరుంది. భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు.
Also Read
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
Read Also: kishan reddy: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన గ్యారంటీలు ఏమయ్యాయి
శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బస్తర్లో ఓటింగ్ శాతం 67.56 శాతంగా నమోదైంది. అయితే పువర్తి నుంచి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదని బూల్ లెవల్ ఆఫీసర్ జావా పటేల్ చెప్పారు. గ్రామంలోని ఓటర్లు భయంతో ఓటేయలేదని అధికారులు తెలిపారు. పువర్తి పోలింగ్ బూత్(నంబర్ 4) అనేది పువర్తి, టేకల్ గుడియం, జోనగూడ అనే మూడు గ్రామాల కోసం పెట్టారు. దీనిని పువర్తికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్గర్ అనే గ్రామంలో ఏర్పాటు చేశారు.
పువర్తిలో 332 మంది, టేకల్గుడియంలో 158 మంది, జోనగూడలో 157 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం బూత్ పరిధిలో 547 మంది ఓటర్లు ఉన్నారు. ఈ బూత్ పరిధిలో మొత్తం 31 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, అయితే వీరిలో ఒక్కరూ కూడా పువర్తికి చెందిన వారు కాదని, టేకల్ గుడియ, జోనగూడకు చెందిన వారని అధికారులు తెలిపారు. బస్తర్ లోక్సభ స్థానం, సుక్మా జిల్లా పరిధిలోని కొంటా అసెంబ్లీ నియోజకవర్గంలో 54.31 శాతం పోలింగ్ నమోదైంది.
ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల జాగరగుండ ఏరియా కమిటీ పువర్తి పరిసర గ్రామాల్లో బ్యానర్లు ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్గఢ్ పోలీసులు పువర్తిలో శిబిరం ఏర్పాటు చేశారు. ఇది మావోయిస్టుకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. మావోయిస్టుల PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్ నంబర్ 1 యొక్క మాజీ కమాండర్ హిద్మాతో పాటు ప్రస్తుత కమాండర్ బార్సే దేవాల స్వగ్రామం. ఈ బెటాలియన్ దక్షిణ బస్తర్ అనేక ఘోరమైన దాడులకు పాల్పడింది.
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..