No Fish, No Wedding: చేపలు, మాంసాహారం పెట్టలేదని పెళ్లిలో వధువు కుటుంబంపై దాడి..
- చేపలు-మాంసాహారం లేదని పెళ్లి క్యాన్సిల్..
- వధువు బంధువుల్ని చితకబాదిన వరుడి కుటుంబీకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Fish, No Wedding: ఉత్తర్ ప్రదేశ్లో మరో పెళ్లి పెటాకులైంది. పెళ్లిలో పనీర్, పులావ్, ఇతర వెజిటేరియన్ ఐటమ్స్ బాగానే పెట్టినప్పటికీ, తమకు చేపలు, మాసం లేదని పెళ్లికొడుకు బంధువులు పెద్ద గొడవనే సృష్టించారు. చివరకు కట్నం కూడా బాగా ముట్టచెప్పినప్పటికీ వరుడి కుటుంబీకులు, వధువు కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. వరుడు వివాహ వేదికపై నుంచి వెళ్లిపోయాడు, దీంతో వివాహం రద్దైంది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు దాడి, వరకట్నంపై ఫిర్యాదు చేశారు.
Read Also: Wedding: కూలర్ వివాదం.. పెళ్లికి నిరాకరించిన వధువు.. వరుడి బాధ వైరల్..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
గురువారం ఉత్తర్ ప్రదేశ్ లోని డియోరియా జిల్లాలోని ఆనంద్ నగర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అభిషేక్ శర్మ అనే వ్యక్తికి సుష్మ అనే అమ్మాయిలో వివాహం కుదిరింది. పెళ్లి చేసుకునేందుకు భారీ ఉరేగింపుతో వరుడు గ్రామానికి చేరుకున్నాడు. పెళ్లికి అంతా సిద్ధమైంది. ఈ సమయంలో మాంసాహారం లేదని వరుడు, అతని తండ్రి సురేంద్ర శర్మ మరికొందరు వధువు సుష్మ తండ్రి దినేష్ శర్మని తిట్టడం ప్రారంభించారు. ఇదిలా ఉండగానే వరుడితో పాటు అతని బంధువులు వధువు బంధువులపై కర్రలతో దాడి చేశారని పోలీసులకు వధువు బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ పెళ్లి కోసం దాదాపుగా రూ. 5 లక్షల కట్నం ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వరుడు అభిషేక్ శర్మకు కట్నంగా కారు కోసం రూ. 4.5 లక్షలు, రెండు బంగారు ఉంగరాలు ఇచ్చానని దినేశ్ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!