Nitesh Rane: ‘‘జిహాదీ, హిందూ వ్యతిరేక ర్యాలీ’’.. ఠాక్రేలు పీఎఫ్ఐ, సిమి కన్నా తక్కువ కాదు..
- ఠాక్రే సోదరుల ర్యాలీపై విరుచుకుపడిన బీజేపీ మంత్రి నితేష్ రాణే..
- వారిది జిహాదీ, హిందూ వ్యతిరేక ర్యాలీ..
- సిమి, పీఎఫ్ఐల కన్నా వీరిద్దరు తక్కువ కాదు అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitesh Rane: మరాఠీ భాషపై ఇద్దరు సోదరులు రాజ్ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయారు. 20 ఏళ్ల తర్వాత, ఒకే వేదికను పంచుకున్నారు. ఇకపై తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో త్రిభాషా విధానంలో భాగంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. మరాఠీలపై హిందీ రుద్దాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అయితే, ఈ విధానంపై వ్యతిరేకత రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అయితే, దీనిని విజయంగా భావిస్తూ ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలుసుకున్నారు.
Read Also: Warangal: జిల్లా కాంగ్రెస్ నేతల వర్గ పోరుపై అధిష్టానం దృష్టి.. గాంధీభవన్కు రావాలని పిలుపు..
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
అయితే, ఈ కలయికపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి నితేష్ రాణే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది హిందువులను బలహీనపరిచే కుట్రగా అభివర్ణించారు. వీరిద్దరు నిర్వహించిన ర్యాలీ హిందూ వ్యతిరేకమని, ప్రజల్ని హిందువులు, మరాఠీలుగా విభజించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఠాక్రే సోదరుల ర్యాలీని జీహాది, హిందూ వ్యతిరేక ర్యాలీగా అభివర్ణించారు. ఇది సమాజాన్ని విభజిస్తుందని, రాష్ట్రాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు.
శుక్రవారం మీడియాతో రాణే మాట్లాడుతూ.. ‘‘మేము హిందువులం, మరాఠీలుగా ఉండటం మాకు గర్వకారణం. జిహాదీలు మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించే విధానం. ఈ వ్యక్తులు కూడా ఇదే చేస్తున్నారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) లేదా సిమికి వీరు భిన్నంగా లేరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాక్రేల ర్యాలీ హిందువులు ఎక్కువగా నష్టపోతారు, తర్వాత నల్ బజార్(ముస్లిం ఆధిపత్య ప్రాంతం)లో స్వీట్లు పంపిణీ చేయబడుతాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?