Nirav Modi: నీరవ్ మోడీకి ఈడీ షాక్.. రూ. 253.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirav Modi: బ్యాంకు రుణాల ఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సంబంధించిన కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పురోగతి సాధించారు. నీరవ్కు సంబంధించిన ₹253.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ జాబితాలో చరాస్థులైన రత్నాలు, ఆభరణాలతో పాటు బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టాల కింద ఆస్తులను అటాచ్ చేసినట్టు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన ఈ ఆస్తులన్నీ హాంకాంగ్లో ఉన్నాయని ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 420, 467, 471, 120-బీ కింద చర్యలు తీసుకున్నామని ఈడీ అధికారులు వివరించారు. హాంకాంగ్లోని నీరవ్ మోదీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రత్నాలు, ఆభరణాలు అక్కడి ప్రైవేటు లాకర్లలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది.
West Bengal: మంత్రి సన్నిహితురాలి ఇంట్లో రూ. 20 కోట్లు.. ఈడీ దాడుల్లో పట్టుబడిన నగదు
Also Read
- Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.13,500కోట్ల మోసం కేసులో నీరవ్ మోడీ ప్రస్తుతం యూకే జైలులో ఉన్నాడు. భారత్కు అప్పగింత ప్రక్రియ జాప్యమవుతున్న నేపథ్యంలో అక్కడి జైళ్లోనే గడుపుతున్నాడు. పీఎన్బీ మోసం కేసును సీబీఐదర్యాప్తు చేస్తుండగా.. మోసం కేసులో మనీల్యాండరింగ్ కింద ఈడీ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. నకిలీ ఎల్వోయూలతో బ్యాంకును మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి పరబ్ సైతం కనిపించకుండా పోయాడు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!