దర్భంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్షీట్ దాఖలు…
దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఐదుగురిపై అభియోగాలు మోపింది. పేలుడుకు ముందు పాకిస్తాన్లో మాలిక్ సోదరుల శిక్షణ పొందినట్లు చార్జ్షీట్లో ప్రస్తావించింది. దర్బంగా ఎక్స్ప్రెస్ రైల్లో పేలుడు తర్వాత నేపాల్ ద్వారా పాకిస్థాన్ వెళ్లేందుకు కుట్ర చేసినట్లు తేల్పింది జాతీయ దర్యాప్తు సంస్థ.
వాయిస్-దర్భంగా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందంటూ ఎన్ఐఏ తెలిపింది. పాకిస్తాన్లో శిక్షణ పొంది వచ్చిన నాసిర్ మాలిక్ సోదరులే దర్భంగా పేలుళ్లకు సూత్రధారులు అని తేల్చింది. దర్భంగా ఎక్స్ప్రెస్లో పేలుడు జరిగిన తర్వాత నేపాల్-పాకిస్థాన్ పారిపోవాలని ప్లాన్ చేసినట్లుగా గుర్తించింది. దర్భంగా పేలుళ్ల కేసులో 5 గురిపై అభియోగాలు మోపింది. ఈ ఐదుగురికి సంబంధించిన ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది.
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
వాయిస్-పాట్నాలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఐఏ. మహమ్మద్ నసీర్ ఖాన్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కఫిల్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్లను నిందితులుగా పేర్కొంది. జూన్ 17న దర్భంగా రైల్వే స్టేషన్లో పేలుడు జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత అదే నెల 24న కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది.
వాయిస్-ఇక..కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు పేలుళ్ల ఘటనలో లష్కరే తోయిబా పాత్ర ఉందని తేల్చారు. పాకిస్థాన్లో ఉంటూ లష్కరే తోయిబా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న హఫీజ్ ఇక్బాల్ ఆదేశాల మేరకు రైల్లో బాంబు పేల్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ చార్జ్ షీట్లో స్పష్టంచేసింది. ఈమేరకు నసీర్ ఖాన్ పలుసార్లు పాకిస్థాన్ వెళ్లి బాంబులు తయారు చేయడంలో శిక్షణ పొందాడు. అనంతరం హైదరాబాద్ వచ్చి తన సోదరుడు ఇమ్రాన్ మాలిక్తో కలిసి హబీబ్ నగర్లో చీరల వ్యాపారం పేరుతో నివాసం ఉన్నారు.
వాయిస్-పాకిస్థాన్ నుంచి పలుమార్లు నసీర్ ఖాన్కు నిధులు కూడా వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పేలుళ్ల కోసం చీరల మూటలో బాంబు పెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి దర్భంగా ఎక్స్ప్రెస్ రైల్లో చీరల పార్శిల్ పంపించారు. కదులుతున్న రైల్లో బాంబు పేలి మంటలు అంటుకొని తీవ్ర ప్రాణనష్టం కలిగేలా చేయాలని లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పేలుళ్ల తర్వాత నిందితులు నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. పకడ్బందీగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దర్భంగా పేలుళ్లకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి సెటిలైన నాసిర్ మాలిక్ సోదరులే పేలుళ్లకు సూత్రధారులను ఎన్ఐఏ తెలిపింది. ఈకేసులో మరి కొంతమంది అనుమానితులు ఉన్నారని వారికి సంబంధించి విచారణ కొనసాగుతోందని దర్యాప్తు సంస్థ కోర్టుకు వెల్లడించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో