Delhi Student Case: ఢిల్లీ స్టూడెంట్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. చంపింది ఎవరో తెలుసా?
New Twist in Delhi Student Killing Case: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక పార్క్లో హత్యకు గురైన విద్యార్థిని కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. కమలా నెహ్రూ కాలేజీ విద్యార్థిని అయిన ఆమెను నర్గీస్గా గుర్తించారు. ఆమెను చంపింది ఎవరో స్నేహితుడు కాదని, వరుసకు సోదరుడు అయ్యే ఇర్ఫాన్ (28) హతమార్చాడని వెల్లడైంది. పెళ్లికి నిరాకరించడం వల్లే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలింది. అతడు ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఇర్ఫాన్కు సరిగ్గా ఆదాయం లేకపోవడం వల్ల.. యువతి కుటుంబసభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. ఇక అప్పటి నుంచి నర్గీస్ అతడ్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఒకానొక దశలో మాట్లాడటం మానేసింది.
Kerala: భార్యకు భయపడి ఇంటి నుంచి పారిపోయిన భర్త.. విషయమేంటంటే?
Also Read
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఇర్ఫాన్.. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో నర్గిస్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. మాల్వియా నగర్లో కోచింగ్ క్లాసెస్కి పార్క్ గుండూ ఆమె వెళ్తుందన్న సంగతి అతనికి తెలుసు. అక్కడే హతమార్చాలని అతడు పథకం రచించాడు. గురువారం 12 గంటల సమయంలో పార్క్కి చేరుకున్న అతడు, నర్గిస్తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఇర్ఫాన్.. ఇనుప రాడ్తో ఆమెపై దాడి చేశాడు. ఆమె చనిపోయిందనుకున్న విషయం నిర్ధారించుకొని, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే.. బాడీ వద్ద లభ్యమైన ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Uttar Pradesh: భర్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భార్య..
మరోవైపు.. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్ సీరియస్గా స్పందించారు. ‘‘ఒకవైపు ఒక మహిళను తన ఇంటి బయటే కాల్చి చంపేస్తే, మరోవైపు మాల్వియా నగర్ వంటి పాష్ ప్రాంతంలో ఒక అమ్మాయిని రాడ్తో కొట్టి చంపేశారు. మహిళలకు ఢిల్లీ నగరం అసురక్షితంగా మారింది. ఇది ఎవరికీ పట్టింపు లేదు. వార్తాపత్రికల్లో కేవలం పేర్లు మారుతున్నాయే తప్ప, వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో