PM Modi: నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారు, కాంగ్రెస్ది బానిస మనస్తత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. దళితులు, వెనకబడినవారికి, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని, ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఆరోపించారు. ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని బోధించకూడదని అన్నారు. అంబేద్కర్ భారతరత్నకు అర్హడని కాంగ్రెస్ ఎప్పుడూ భావించలేదని ఆయన అన్నారు. నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖను ప్రస్తావించారు. ‘‘నాకు రిజర్వేషన్లు, ముఖ్యంగా ఉద్యోగాల్లో ఇష్టం లేదు, అసమర్థతను ప్రోత్సహించే ఏ చర్యకైనా నేను వ్యతిరేఖం’’ అని ఆయన రాసిన లేఖను గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Mouli Talks: ఏపీ క్యాపిటల్ పై జోక్.. తల్లితండ్రులను లాగొద్దు ప్లీజ్ అంటూ #90స్ మౌళి ట్వీట్
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
అధికారంలో ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని, 10 ఏళ్లలో మేము 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చామని, కానీ ఆర్థిక వ్యవస్థ గురించి కాంగ్రెస్ బోధించాలని అనుకుంటోందని చురకలు అంటించారు. కాంగ్రెస్ తన ప్రయోజనాల కోసం వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని, సైన్యాన్ని ఆదునీకరించేందుకు అనుమతించని కాంగ్రెస్, ఇప్పుడు భద్రతపై ఉపన్యాసం ఇస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ సురేష్ దక్షణ భారతదేశాన్ని ప్రత్యేకదేశంగా గుర్తించాలనే వ్యాఖ్యాలను ఉద్దేశిస్తూ.. ఉత్తర-దక్షిణ విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని చంపిందని, ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసి, దేశాన్ని విభజించాలని అనుకుందని ఆరోపించారు.
బ్రిటీష్ వారి నుంచి కాంగ్రెస్ ప్రేరణ పొందిందని, కాంగ్రెస్ని పుట్టించిందే ఓ బ్రిటీషర్ అని, కాంగ్రెస్ది బానిస మనస్తత్వమని, ఇది భారతదేశాన్ని అణివేసేలా ప్రోత్సహించిందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ గతంలో బ్రిటన్ సమయంలో సమానంగా ఉండేందుకు సాయంత్రం బడ్జెట్ ప్రవేశపెట్టేవారని చెప్పారు. ఏడు దశాబ్ధాలుగా జమ్మూ కాశ్మీర్ లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు హక్కులు కల్పించలేదని, ఆర్టికల్ 370ని రద్దు చేయలేదని, ప్రస్తుతం వారికి హక్కులు లభించాయని మోడీ అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎన్డీయే ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిందని ప్రధాని సభలో అన్నారు.
తాజావార్తలు
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!