NTV Telugu Site icon

NEET-UG 2024: నేడు నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ..

Neet

Neet

NEET-UG 2024: నీట్- యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీంతో నీట్‌–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ ( సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ కాబోతుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నీట్‌కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలను విననుంది. అయితే, పరీక్షను క్యాన్సిల్ చేయడం సరైన పద్దతి కాదని.. పేపర్‌ లీకేజీ భారీ ఎత్తున జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక, పేపర్‌ లీకేజీ ఆరోపణలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అయితే, ఇప్పటికే నీట్ యూజీ- 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 38 పిటిషన్‌లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ క్రమంలో అన్ని పిటిషన్లను కలిపి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇక, మరోవైపు ఈ పరీక్ష క్యాన్సిల్ చేయకూడదని ఇటివల పలువురు విద్యార్థులు గుజరాత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు మంచి మార్కులు వచ్చాయి.. ఎగ్జామ్ రద్దు చేస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే అనేక చోట్ల పరీక్ష రద్దు చేయొద్దని కోరుతూ నిరసన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 24 లక్షల మంది రాసిన ఈ ఎగ్జామ్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.