Union Minister Kiren Rijiju: కొలీజియ వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kiren Rijiju: న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలిజీయం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రక్రియపై ఆందోళనలు ఉన్నందున ఈ విషయంపై చర్చ జరగాల్సి ఉందన్నారు. అత్యున్నత న్యాయవ్యవస్థలో నియామకాలు పెండింగ్లో ఉన్నాయని, అయితే “న్యాయ మంత్రి వల్ల కాదని, వ్యవస్థ కారణంగా” అని ఆయన అన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో న్యాయవాదుల సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సులో ‘సరికొత్త న్యాయ సమస్యలు’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఉన్నత న్యాయవ్యవస్థలో పదవుల భర్తీ పెండింగ్లో ఉండడానికి వ్యవస్థలోని లోపాలే కారణం తప్ప, న్యాయమంత్రి కాదని అన్నారు. పదవుల భర్తీ త్వరగా జరిగేలా కొలీజియం వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉందని అన్నారు.
అనంతరం ఆయన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అది అందరికీ తెలుసని, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానిపై తదుపరి చర్చ జరుగుతుందని, నా అభిప్రాయాలను అందరి ముందు ఉంచుతానని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం 2014లో న్యాయమూర్తుల నియామక విధానాన్ని మార్చేందుకు ప్రయత్నించింది. 2014లో తీసుకొచ్చిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమీషన్ (NJAC) చట్టం ఉన్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నియమించడంలో ఎగ్జిక్యూటివ్కు ప్రధాన పాత్రను కల్పించింది. కానీ దాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వానికి సమర్ధవంతంగా ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా అన్ని హైకోర్టుల్లో అదనపు సొలిసిటర్ జనరల్లను నియమిస్తామని శనివారం రిజిజు తెలిపారు.
Also Read
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
JDU: ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కాదు వ్యాపారవేత్త.. జేడీయూకు అవసరం లేదు
దేశంలోని న్యాయస్థానాలను డిజిటలైజ్ చేస్తున్నామని, దీనివల్ల ప్రజలు తమ కేసులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు దోహదపడుతుందన్నారు. హైకోర్టులు, దిగువ కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. లా అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో 4.85 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఈ పెండింగ్ను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!