Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Prashant Kishor Not A Political Worker But A Businessman Says Janata Dal United President

JDU: ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కాదు వ్యాపారవేత్త.. జేడీయూకు అవసరం లేదు

Published Date :September 18, 2022 , 10:52 am
By Mahesh Jakki
JDU: ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కాదు వ్యాపారవేత్త.. జేడీయూకు అవసరం లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

JDU: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై జేడీయూ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్ అలియాస్ లలన్‌ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యూహకర్తగా మారిన రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో గట్టి పట్టు సాధించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రల్లో భాగంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారని జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ శనివారం ఆరోపించారు. ప్రశాంత్‌ కిషోర్‌ రాజకీయ వ్యూహకర్త కాదని ఆయన ఓ వ్యాపారి అని లలన్‌ సింగ్ విమర్శించారు. పార్టీలో చేరాలని నితీష్ కుమార్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని ప్రశాంత్‌ కిషోర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో లలన్‌ సింగ్ ఈ విధంగా నొక్కి చెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌ కొంతకాలంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇటీవల బిహార్‌ సీఎం నితీష్ కుమార్‌తో ప్రశాంత్‌ కుమార్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. గతంలో జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌.. కొన్నాళ్లుగా నితీష్‌పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, నితీష్ నుంచి తనకు పార్టీలో చేరాలని ఆహ్వానం అందిందని, అయితే తాను తిరస్కరించానని ప్రశాంత్ కిషోర్‌ పేర్కొన్నారు. దీనిపై లలన్‌ సింగ్‌ స్పందిస్తూ.. పీకేకు జేడీయూ నుంచి ఎలాంటి ఆఫర్‌ అందలేదని లలన్‌ సింగ్‌ అన్నారు. “బీహార్‌లో బీజేపీ కుట్రలపై ఆధారపడుతోంది. మొదట ఆర్‌సీపీ సింగ్‌ను ఉపయోగించుకుంది, ఇప్పుడు అది ప్రశాంత్ కిషోర్‌ను ఉపయోగిస్తోంది. ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయ వ్యూహకర్త కాదు.. అతడో వ్యాపారి. గతంలో బీజేపీ కోసం కొంతకాలం పనిచేశాడు. మేం అప్రమత్తంగా ఉన్నాం. భాజపా పాచికలు పారనివ్వబోం” అని లలన్‌ సింగ్‌ అన్నారు.

Also Read

  • Sree Vishnu : హిట్లు లేకున్నా జోరు తగ్గని శ్రీవిష్ణు..
  • Astrology: ఏప్రిల్‌ 25, శనివారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!
  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

NIA inspections: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. నిజామాబాద్‌లోనే 22 మందిని..

కొన్ని రోజుల క్రితం తనను ప్రశాంత్ కిషోర్‌ ఢిల్లీలో కలిశారని జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్ చెప్పారు. పార్టీలోకి రావాలంటే నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయనకు తాను స్పష్టం చేశానని అన్నారు. ఆ తర్వాత సీఎం నితీష్ కుమార్‌తో అపాయింట్ మెంట్ కుదిరిందని అయితే ఓ వ్యూహం ప్రకారం అతను దాన్ని తప్పుగా ప్రచారం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తనను ఇంటికి పిలిచినా తాను వెళ్లలేదని పీకే మీడియాతో చెప్పారని, అదంతా అవాస్తవం అన్నారు. ఇటీవల సీఎం నితీష్‌ కుమార్‌తో ప్రశాంత్ కిషోర్‌ భేటీ జరిగింది. అప్పుడు కూడా.. తనని నితీష్ పార్టీలోకి ఆహ్వానించారని, సమావేశానికి కూడా ఆయనే తనను పిలిపించారని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పుకున్నారు. దీనిపై రాజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. లలన్‌ సింగ్ వ్యాఖ్యలతో ప్రశాంత్‌ కిషోర్‌- నితీష్‌ కుమార్‌ల మధ్య స్నేహం చిగురించిందన్న వార్తలు అవాస్తవం అని తేలిపోయారు. లలన్‌ సింగ్‌ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్‌ స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar politics
  • bjp
  • Janata Dal United President
  • JDU
  • lalan singh

తాజావార్తలు

  • RCB vs GT: చిన్నస్వామిలో కోహ్లీ విశ్వరూపం.. గుజరాత్‌ను ఉతికేసిన ఆర్‌సీబీ.. పాయింట్ల పట్టికలో టాప్‌-2కి జంప్‌!

  • Sree Vishnu : హిట్లు లేకున్నా జోరు తగ్గని శ్రీవిష్ణు..

  • Astrology: ఏప్రిల్‌ 25, శనివారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!

  • AAP Crisis: “కేజ్రీవాల్ దారి తప్పాడు” అన్నా హజారే సంచలన కామెంట్స్!

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions