Himanta Biswa Sarma: యూసీసీ అమలు, పీఓకే కోసం ఏన్డీయే 400 సీట్లు గెలవాలి..
Himanta Biswa Sarma: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేయడానికి, మథురలో శ్రీకృష్ణ జన్మస్థాన్లో గొప్ప ఆలయాన్ని నిర్మించేందుకు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలవాలని అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ శనివారం అన్నారు. బెగుసరాయ్లో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన నిందించారు. పీఓకేకు భరోసా కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లు గెలవాలని, పీఓకే భారత్కి తిరిగి వస్తుందని అన్నారు.
Read Also: UP: రెండేళ్లుగా యువతిపై అత్యాచారం.. వీడియోలు తీసి మరి బ్లాక్మెయిల్
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
‘‘కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరియు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేదు. నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను రాహుల్, లాలూ ఎప్పటికీ అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించగలరా.?’’ అని అడిగారు. మత ఆధారిత రిజర్వేషన్లను కాంగ్రెస్ కల్పిస్తోందని దుయ్యబట్టారు. ఇండియా కూటమి నాయకులు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, పీఓకే సమస్య లేవనెత్తొద్దని చెబుతున్నాడని, అయితే, ఆ బాంబుల గడువు తీరిపోయిందని తాను విశ్వసిస్తున్నట్లు హిమంత అన్నారు.
కేంద్రంలోని మా ప్రభుత్వం పీఓకే భారత్కి చెందినదని, దానిని ఏ శక్తి లాక్కోలేదని చెబుతోందని, పీఓకే భారత్కి తిరిగి వచ్చేలా ప్రధాని మోడీకి మూడోసారి అధికారం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగించినందున, రాబోయే కాలంలో పీఓకే భారత్ తిరిగి వచ్చేలా చేస్తుందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ/ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింకు కోటా ఇచ్చిందని, దీన్ని దేశం మొత్తం చేయాలని ఆ పార్టీ భావిస్తోందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ అంగీకరించదని చెప్పారు. బీహార్లోని బెగుసరాయ్, దర్భంగా, ఉజియార్పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ లోక్సభ స్థానాలకు నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Onam Release : ఓనమ్ స్పెషల్.. ముగ్గురు మలయాళ బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్
-
Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
-
B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
-
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
-
Vishwambhara : ‘పెద్ది’ అడ్డంకి తొలగింది.. విశ్వంభర రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!