Himanta Biswa Sarma: యూసీసీ అమలు, పీఓకే కోసం ఏన్డీయే 400 సీట్లు గెలవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేయడానికి, మథురలో శ్రీకృష్ణ జన్మస్థాన్లో గొప్ప ఆలయాన్ని నిర్మించేందుకు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలవాలని అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ శనివారం అన్నారు. బెగుసరాయ్లో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన నిందించారు. పీఓకేకు భరోసా కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లు గెలవాలని, పీఓకే భారత్కి తిరిగి వస్తుందని అన్నారు.
Read Also: UP: రెండేళ్లుగా యువతిపై అత్యాచారం.. వీడియోలు తీసి మరి బ్లాక్మెయిల్
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
‘‘కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరియు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేదు. నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను రాహుల్, లాలూ ఎప్పటికీ అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించగలరా.?’’ అని అడిగారు. మత ఆధారిత రిజర్వేషన్లను కాంగ్రెస్ కల్పిస్తోందని దుయ్యబట్టారు. ఇండియా కూటమి నాయకులు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, పీఓకే సమస్య లేవనెత్తొద్దని చెబుతున్నాడని, అయితే, ఆ బాంబుల గడువు తీరిపోయిందని తాను విశ్వసిస్తున్నట్లు హిమంత అన్నారు.
కేంద్రంలోని మా ప్రభుత్వం పీఓకే భారత్కి చెందినదని, దానిని ఏ శక్తి లాక్కోలేదని చెబుతోందని, పీఓకే భారత్కి తిరిగి వచ్చేలా ప్రధాని మోడీకి మూడోసారి అధికారం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగించినందున, రాబోయే కాలంలో పీఓకే భారత్ తిరిగి వచ్చేలా చేస్తుందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ/ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింకు కోటా ఇచ్చిందని, దీన్ని దేశం మొత్తం చేయాలని ఆ పార్టీ భావిస్తోందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ అంగీకరించదని చెప్పారు. బీహార్లోని బెగుసరాయ్, దర్భంగా, ఉజియార్పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ లోక్సభ స్థానాలకు నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!