Bihar Elections: నేడు ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల.. 4 అంశాలపై ఫోకస్!
- నేడు ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల
- 4 అంశాలపై ఫోకస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి విడత ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధాని మోడీ, రాహుల్గాంధీ, కేంద్రమంత్రులు విరామం లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kash Patel: చిక్కుల్లో ఎఫ్బీఐ చీఫ్.. ప్రియురాలి కోసం జెట్లో షికార్లు
Also Read
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
ఇదిలా ఉంటే శుక్రవారం ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కూటమి పార్టీలన్నీ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సహా కూటమిలోని అగ్ర నాయకులందరూ హాజరై మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 9:30 గంటలకు మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Minor Girl Assault: 6వ తరగతి బాలికను లైంగికంగా వేధించిన పీటీఐ..
ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక), రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి. ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రధానంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత వంటి ఇతర అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీవలే ఇండియా కూటమి కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. 32 పేజీల మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి చట్టం చేయనున్నట్లు ప్రకటించింది. ఇక జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్)లను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని తెలిపింది. నెలకు రూ. 30,000 వేల జీతం ఇస్తామని వెల్లడించింది.
బీహార్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఒకరు అధికారం నిలబెట్టుకునేందుకు.. ఇంకొకరు అధికారం కోసం పోరాటం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
-
Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
-
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
-
Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
-
Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..