Ajit Pawar: కీలక సమయంలో అజిత్ పవార్ ఢిల్లీ టూర్.. సర్వత్రా ఉత్కంఠ!
- ఢిల్లీ వెళ్లిన ఎన్సీపీ నేత అజిత్ పవార్
- బీజేపీ అగ్ర నేతలను కలవనున్న అజిత్
- అజిత్ పవార్ ఢిల్లీ టూర్పై సర్వత్రా ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. దాదాపు 9 రోజులవుతున్నా.. ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించారు. ఇంకోవైపు డిసెంబర్ 5నే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుందని బీజేపీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. హఠాత్తుగా ఆయన దేశ రాజధానికి వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై హైకమాండ్తో చర్చేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలపై బీజేపీ అగ్ర నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పోర్టుపోలియోలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ఆస్ట్రేలియాలో టీమిండియా కెప్టెన్ మొదటి సెంచరీ చేస్తాడా? రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే
Also Read
- El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
వాస్తవానికి సోమవారం ముంబైలో ఎన్డీఏ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఏక్నాథ్ షిండేకు అనారోగ్యం కారణంగా సమావేశం రద్దైంది. కీలక సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంపై ధ్వజమెత్తుతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్లో నితీష్ కుమార్కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది. చివరికి బీజేపీ అధిష్టానం ఏం తేల్చనుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Pneumonia In Children: చలి వణికించేస్తోంది.. పిల్లలలో ఎక్కువతున్న న్యుమోనియా.. జాగ్రత్త సుమీ
తాజావార్తలు
-
Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
-
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
-
Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!