Ajit Pawar: కీలక సమయంలో అజిత్ పవార్ ఢిల్లీ టూర్.. సర్వత్రా ఉత్కంఠ!
- ఢిల్లీ వెళ్లిన ఎన్సీపీ నేత అజిత్ పవార్
- బీజేపీ అగ్ర నేతలను కలవనున్న అజిత్
- అజిత్ పవార్ ఢిల్లీ టూర్పై సర్వత్రా ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. దాదాపు 9 రోజులవుతున్నా.. ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించారు. ఇంకోవైపు డిసెంబర్ 5నే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుందని బీజేపీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. హఠాత్తుగా ఆయన దేశ రాజధానికి వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై హైకమాండ్తో చర్చేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలపై బీజేపీ అగ్ర నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పోర్టుపోలియోలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ఆస్ట్రేలియాలో టీమిండియా కెప్టెన్ మొదటి సెంచరీ చేస్తాడా? రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే
Also Read
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
వాస్తవానికి సోమవారం ముంబైలో ఎన్డీఏ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఏక్నాథ్ షిండేకు అనారోగ్యం కారణంగా సమావేశం రద్దైంది. కీలక సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంపై ధ్వజమెత్తుతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్లో నితీష్ కుమార్కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది. చివరికి బీజేపీ అధిష్టానం ఏం తేల్చనుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Pneumonia In Children: చలి వణికించేస్తోంది.. పిల్లలలో ఎక్కువతున్న న్యుమోనియా.. జాగ్రత్త సుమీ
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!