Ajit Pawar: కీలక సమయంలో అజిత్ పవార్ ఢిల్లీ టూర్.. సర్వత్రా ఉత్కంఠ!
- ఢిల్లీ వెళ్లిన ఎన్సీపీ నేత అజిత్ పవార్
- బీజేపీ అగ్ర నేతలను కలవనున్న అజిత్
- అజిత్ పవార్ ఢిల్లీ టూర్పై సర్వత్రా ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. దాదాపు 9 రోజులవుతున్నా.. ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించారు. ఇంకోవైపు డిసెంబర్ 5నే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుందని బీజేపీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. హఠాత్తుగా ఆయన దేశ రాజధానికి వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై హైకమాండ్తో చర్చేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలపై బీజేపీ అగ్ర నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పోర్టుపోలియోలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ఆస్ట్రేలియాలో టీమిండియా కెప్టెన్ మొదటి సెంచరీ చేస్తాడా? రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
వాస్తవానికి సోమవారం ముంబైలో ఎన్డీఏ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఏక్నాథ్ షిండేకు అనారోగ్యం కారణంగా సమావేశం రద్దైంది. కీలక సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంపై ధ్వజమెత్తుతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్లో నితీష్ కుమార్కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది. చివరికి బీజేపీ అధిష్టానం ఏం తేల్చనుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Pneumonia In Children: చలి వణికించేస్తోంది.. పిల్లలలో ఎక్కువతున్న న్యుమోనియా.. జాగ్రత్త సుమీ
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!