Naveen Patnaik: విపక్షాల కూటమిలో చేరబోం.. ఒంటరిగానే పోటీ.. నితీష్ కుమార్కు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధినేత విపక్షాల పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విపక్షాలతో కలిసి పోటీ చేయమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ ఒంటరిగానే పోలీ చేస్తుందని ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని డిమాండ్ల గురించి ప్రధాని మోడీని కలిసినట్లు చెప్పారు.
Read Also: Italy: మిలన్ నగరంలో భారీ పేలుడు.. అగ్నికి ఆహుతైన కార్లు..
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
పూరీలో ఏర్పాటు చేయాల్సిన అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఆయన మాట్లాడినట్లు వెల్లడించారు. భువనేశ్వర్ లో ఇప్పటికే విమాన ట్రాఫిక్ పెరిగిందని, అందుకే విస్తరణ గురించి మాట్లాడినట్లు చెప్పారు. ప్రధాని సాయం చేస్తానని మాటిచ్చారన్నారు. నాకు తెలిసినంత వరకు థర్డ్ ఫ్రంట్ అనేది వచ్చే అవకాశం లేదని నవీన్ పట్నాయక్ అన్నారు.
ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ ని కలిశారు. ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. ఈ చర్చల అనంతరం తమ మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని నవీన్ పట్నాయక్ అన్నారు. అయితే నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను కూడగట్టి, వాటి మధ్య ఐక్యత కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని, బీజేపీ ఎదుర్కోవాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యం అని చెబుతున్నారు. తాజాగా గురువారం ఆయన మహారాష్ట్ర వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేని కలిశారు. కాగా నవీన్ పట్నాయక్ విపక్షాలతో కలిసి పోటీ చేయమని ప్రకటించడం నితీష్ కుమార్ కు షాక్ తగిలేలా చేసింది.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!