Nathuram Godse: నాథూరామ్ గాడ్సే ఫోటోతో తిరంగా యాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Mahasabha takes out Tiranga yatra with Godse’s photo: భారత్ స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. ఆజాదీ కా అమృత్ , హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలు కూడా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేశారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హిందూ మహాసభ చేసిన తిరంగా యాత్ర ఇప్పుడు వివాదాస్పదం అయింది. జాతి పిత మహాత్మాగాంధీని హతమార్చిన వ్యక్తి నాథూరామ్ గాడ్సే ఫోటోలతో తిరంగా యాత్రను చేపట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
సోషల్ మీడియా వ్యాప్తంగా నాథూరామ్ గాడ్సే ఫోటోలు పెట్టుకుని తిరంగా యాత్ర చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిందూమహాసభ ఓ జీపుకు గాడ్సే ఫోటోను పెట్టి దాన్ని అనుసరించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వివాదంపై హిందూ మహాసభ జాతీయాధ్యక్షుడు యోగేంద్ర వర్మ స్పందించారు. తమ కార్యకర్తలు ఆగస్టు 15న గాడ్సేతో పాటు పలువురు స్వాతంత్రయోధుల ఫోటోలతో యాత్ర నిర్వహించారని ఆయన అన్నారు.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
Read Also: Kerala: కేరళలో దారుణం.. మైనర్ పై తండ్రి స్నేహితుల అత్యాచారం
ఆయన మాట్లాడుతూ.. గాంధీ జాతి వ్యతిరేక విధానాలకు పాల్పడటంతోనే గాడ్సే ఈ చర్యకు దిగాడని మేము విశ్వసిస్తున్నామని.. గాంధీ విధానాల వల్లే నాథూరామ్ గాడ్సే హత్య చేయాల్సి వచ్చిందని యోగేంద్ర వర్మ అన్నారు. గాడ్సే సొంతంగా తన కేసుపై పోరాడారని.. ఆయన కోర్టులో చెప్పినవన్నింటిని ప్రభుత్వం బహిరంగ పరచాలని.. గాంధీని ఎందుకు హత్య చేశారో ప్రజలకు తెలియడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ాయన అన్నారు. గాంధీ హిందూ వ్యతిరేక విధానాల వల్ల విభజన సమయంలో 30 లక్షల మంది హిందువులు, ముస్లింలు చంపబడ్డారని.. దీనికి గాంధీయే బాధ్యుడని వర్మ పేర్కొన్నట్లు తెలిసింది.
Location : Muzaffarnagar, Uttar Pradesh.
On the occasion of independence day, far right Hindutva outfit Hindu Mahasabha took out a rally with the picture of Nathuram Godse, the assassin of Mahatma Gandhi. pic.twitter.com/qdLQrvuh2o
— HindutvaWatch (@HindutvaWatchIn) August 16, 2022
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!