Kerala: కేరళలో దారుణం.. మైనర్ పై తండ్రి స్నేహితుల అత్యాచారం
Minor girl physically molested by father’s friends in kerala: మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. పోక్సో, నిర్భయ, దిశ వంటి చట్టాలను తీసుకువచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారం కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే చాలా సందర్భాల్లో మహిళలకు, బాలికలకు దగ్గరగా ఉండే వ్యక్తులే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియన బాలికను చెరబడుతున్నారు దుర్మార్గులు. మైనర్ బాలికలపై అత్యాచార విషయంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు వేదనను అనుభవిస్తున్నారు.
ఇలాంటి సంఘటనే కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళ త్రిసూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి స్నేహితులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని స్కూల్ లో ఓ కౌన్సిలింగ్ సమయంలో విద్యాలయ సిబ్బందికి వెళ్లడించింది సదరు బాలిక. పాఠశాల యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నారు పోలీసులు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Nayanthara: చందమామను భానుడు ముద్దాడిన వేళ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిసూర్ జిల్లాకు చెందిన బాలిక.. మొదటిసారి తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని తల్లికి వెల్లడించింది. అయితే నిందితులను ఎదుర్కొలేనని పోలీసుకు ఫిర్యాదు చేయలేదు. దీంతో తరువాత కూడా ఇలాగే పలుమార్లు నిందితులు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి మాదకద్రవ్యాల వ్యాపారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ముగ్గురు తరుచూ బాలిక తండ్రి ఇంటికి వస్తుండేవారు. ముగ్గురు నిందితులు బాలికపై పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని వైద్య పరీక్షల్లో నిర్థారించారు.
ఇప్పటికే నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు తల్లిదండ్రులపై కూడా కేసులు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. బాాలికను సురక్షితంగా రక్షించని కారణంగా తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేస్తామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!