Nagpur: అమానుషం.. 12 ఏళ్ల బాలుడు 2 నెలల నుంచి నిర్బంధం.. కారణమిదే!
- మహారాష్ట్ర నాగ్పూర్లో అమానుషం
- 12 ఏళ్ల బాలుడు 2 నెలల నుంచి నిర్బంధం
- విడిపించిన పోలీసులు.. తల్లిదండ్రులపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘మొక్కై వంగనిది మ్రానై వంగునా’’ అని పెద్దలు అంటుంటారు. పిల్లలు చెడు అలవాట్లకు గురి కాకుండా చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్చించాలని అంటారు. అవి జీవితాంతం తోడుంటాయని చెబుతుంటారు. అయితే చిన్నప్పుడు క్రమశిక్షణ పెట్టకుండా పెద్దయ్యాక బుద్ధులు నేర్పించకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 12 ఏళ్ల కొడుకు దొంగతనాలకు పాల్పడుతున్నాడని తల్లిదండ్రులు అమానుష చర్యకు పాల్పడ్డారు. సంకెళ్లతో బంధించి దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh Encounter: అభయారణ్యంలో కాల్పుల మోత.. 14 మంది మావోయిస్టులు హతం
Also Read
నాగ్పూర్కు చెందిన దంపతులు దినసరి కూలీలు. 12 ఏళ్ల కొడుకు స్కూల్కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో అల్లరి పిల్లాడిగా మారడమే కాకుండా ఇళ్లల్లో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దీంతో బిడ్డను క్రమశిక్షణలో పెట్టేందుకు కఠిన చర్యలకు దిగారు. ప్రతిరోజూ కూలీ పనులకు వెళ్లే ముందు కొడుకును స్తంభానికి సంకెళ్లు వేసి వెళ్లిపోయేవారు. దీంతో పిల్లాడు ఆకలితో అల్లాడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ ఏ పార్టీకి రిమోట్ కంట్రోల్ కాదు.. అన్ని మతాలను గౌరవిస్తాం
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గొలుసులతో బంధించిన బాలుడిని విడిపించారు. ఈ క్రమంలో బాలుడు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా కనిపెట్టారు. బాలుడి కాళ్లు, చేతులకు గాయాలైనట్లుగా జిల్లా మహిళా, శిశు అభివృద్ధి కార్యాలయం బృందం గుర్తించింది. వెంటనే బాలుడికి చికిత్స అందించి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. తల్లిదండ్రులు గత 2 నెలలుగా ఇలా చేసినట్లుగా గుర్తించారు. మాట వినడం లేదని.. అల్లరి చిల్లరగా తిరగడమే కాకుండా ఫోన్లు దొంగిలించడంతోనే బంధించినట్లుగా తల్లిదండ్రులు చెప్పారు. తరచుగా ఇంట్లో నుంచి పారిపోతున్నాడనే గొలుసులతో బంధించినట్లు తెలిపారు.
తల్లిదండ్రులపై జువెనైల్ జస్టిస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి పంపారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ సంఘటన గురించి పోలీసులకు రెండుసార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. స్థానికులు చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ (1098)కు సమాచారాన్ని అందించగా రెస్క్యూ బృందం వెంటనే చర్యలు తీసుకుందని వెల్లడించారు. పిల్లల పట్ల ఏ విధమైనా వేధింపులు, హింస గమనించినట్లయితే వెంటనే పిల్లల రక్షణ వ్యవస్థకు లేదా పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పౌరులకు విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!