Mumbai rain: ముంబైలో భారీ వర్షాలు.. 24 గంటల పాటు రెడ్ అలర్ట్..!
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు..
- ముంబైలోని వీధులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి..
- ఇప్పటికే 50 విమానాలు క్యాన్సిల్ చేయగా.. రైళ్ల సైతం రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai rain: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముంబైలోని వీధులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ఇప్పటికే 50 విమానాలు రద్దు కాగా, పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సైతం రద్దు చేశారు. ఇక, లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలో ఇవాళ (మంగళవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముంబైలో 24 గంటలు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే మినహా ప్రజలెవరూ బయటకు రావొద్దని తెలిపారు.
Read Also: Vanangaan Trailer : అదరగొట్టిన బాల.. ట్రైలర్..భళా..
Also Read
కాగా, ముంబైలోని విద్యా సంస్థలకు బీఎంసీ అధికారులు సెలవులు ప్రకటించారు. నేవీ ముంబై, థానే రాయ్గఢ్లోని అన్ని పాఠశాలు, కాలేజీలను మూసివేయాలని సూచించారు. జులై 12వ తేదీ వరకు ముంబైలోని పాల్ఘర్, థానే, ధూలే, ఔరంగాబాద్, జాల్నా, పర్భానీ, బీడ్, హింగోలి, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్, అకోలా, అమరావతి, నందుర్బార్, జల్గావ్, నాసిక్, అహ్మద్నగర్, కొల్హాపూర్, సాంగ్లీ, షోలాపూర్, భండారా ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Also: Rahul Gandhi: ఈ రోజు రాయ్బరేలీలో రాహుల్గాంధీ పర్యటన.. కార్యకర్తలతో భేటీ..!
అయితే, సతారా, పూణే జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాలతో సహా మధ్య మహారాష్ట్రలో ఇవాళ (మంగళవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రదేశాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలతో కూడిన దక్షిణ కొంకణ్ కు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!