Mumbai Threat Case: ముంబై ఉగ్ర బెదిరింపుల కేసు.. ఒకరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Threat Case: ముంబైలో మళ్లీ 26/11 తరహా ఉగ్రదాడికి పాల్పడతామంటూ అగంతుకులు నుంచి బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టిస్తోంది. ఆ మెసేజ్ వచ్చిన ఫోన్ నంబరుకు పాకిస్థాన్ కోడ్ ఉండడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం రాత్రి సెంట్రల్ ముంబయి పరిధి వర్లీలో ఉన్న ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ వాట్సప్ నంబర్కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఈ సందేశానికి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ శనివారం అర్ధరాత్రి విరార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది.
పాకిస్థాన్ ఆధారిత నంబర్ నుంచి వచ్చిన వాట్సప్ సందేశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.భారత్లో ఆరుగురు వ్యక్తులు ఈ దాడిని అమలు చేస్తారని సందేశంలో పేర్కొన్నారు. ముంబై పోలీసులు తక్షణ ప్రాతిపదికన దర్యాప్తు ప్రారంభించారని, భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. నవంబర్ 26, 2008న ముంబై అంతటా పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిబా జరిపిన దాడి తరహాలో మళ్లీ దాడులు చేపడతామని ఈ సందేశంలో హెచ్చరించారు. 26/11 పేలుళ్ల ఉగ్రవాది అజ్మల్ కసబ్, ఇటీవల మృతిచెందిన అల్ఖైదా అధినేత అల్ జవహరీ పేర్లను సందేశాల్లో ప్రస్తావించారు. ఈ మెసేజ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.
Also Read
- Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
- UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
Extortion Scam: రూ.500 కోట్ల ఇన్స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో గల హరిహరేశ్వర్ బీచ్లో ఏకే 47 రైఫిళ్లు, తుపాకులు, మందుగుండు సామగ్రితో కూడిన పడవ గురువారం లభ్యమైన అనంతరం భద్రతాపరమైన భయం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. పడవ రికవరీ తరువాత మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆ పడవ ఆస్ట్రేలియా పౌరుడికి చెందినదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
నవంబర్ 26, 2008 న, పాకిస్తాన్ నుంచి 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి కాల్పులు జరిపారు.18 మంది భద్రతా సిబ్బందితో సహా వందలాది మంది మరణించారు. ముంబైలో అనేక మంది గాయపడ్డారు. దేశంలోని ఎలైట్ కమాండో దళం ఎన్ఎస్జీతో సహా తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు తరువాత హతమార్చాయి. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్. నాలుగేళ్ల తర్వాత నవంబర్ 21, 2012న అతన్ని ఉరితీశారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..