Mumbai Threat Case: ముంబై ఉగ్ర బెదిరింపుల కేసు.. ఒకరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Threat Case: ముంబైలో మళ్లీ 26/11 తరహా ఉగ్రదాడికి పాల్పడతామంటూ అగంతుకులు నుంచి బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టిస్తోంది. ఆ మెసేజ్ వచ్చిన ఫోన్ నంబరుకు పాకిస్థాన్ కోడ్ ఉండడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం రాత్రి సెంట్రల్ ముంబయి పరిధి వర్లీలో ఉన్న ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ వాట్సప్ నంబర్కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఈ సందేశానికి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ శనివారం అర్ధరాత్రి విరార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది.
పాకిస్థాన్ ఆధారిత నంబర్ నుంచి వచ్చిన వాట్సప్ సందేశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.భారత్లో ఆరుగురు వ్యక్తులు ఈ దాడిని అమలు చేస్తారని సందేశంలో పేర్కొన్నారు. ముంబై పోలీసులు తక్షణ ప్రాతిపదికన దర్యాప్తు ప్రారంభించారని, భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. నవంబర్ 26, 2008న ముంబై అంతటా పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిబా జరిపిన దాడి తరహాలో మళ్లీ దాడులు చేపడతామని ఈ సందేశంలో హెచ్చరించారు. 26/11 పేలుళ్ల ఉగ్రవాది అజ్మల్ కసబ్, ఇటీవల మృతిచెందిన అల్ఖైదా అధినేత అల్ జవహరీ పేర్లను సందేశాల్లో ప్రస్తావించారు. ఈ మెసేజ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.
Also Read
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
Extortion Scam: రూ.500 కోట్ల ఇన్స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో గల హరిహరేశ్వర్ బీచ్లో ఏకే 47 రైఫిళ్లు, తుపాకులు, మందుగుండు సామగ్రితో కూడిన పడవ గురువారం లభ్యమైన అనంతరం భద్రతాపరమైన భయం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. పడవ రికవరీ తరువాత మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆ పడవ ఆస్ట్రేలియా పౌరుడికి చెందినదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
నవంబర్ 26, 2008 న, పాకిస్తాన్ నుంచి 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి కాల్పులు జరిపారు.18 మంది భద్రతా సిబ్బందితో సహా వందలాది మంది మరణించారు. ముంబైలో అనేక మంది గాయపడ్డారు. దేశంలోని ఎలైట్ కమాండో దళం ఎన్ఎస్జీతో సహా తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు తరువాత హతమార్చాయి. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్. నాలుగేళ్ల తర్వాత నవంబర్ 21, 2012న అతన్ని ఉరితీశారు.
తాజావార్తలు
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!