RBI MPC Meeting: కీలకం కానున్న ఎంపీసీ మీటింగ్.. వడ్డీ రేట్లపై ఆతృతగా ఎదురు చూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI MPC Meeting: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి కొన్ని వ్యాపార లావాదేవీలు ఆధారపడి ఉంటాయి. ఆర్బీఐ తీసుకునే నిర్ణయంతో ఆయా రంగాల్లో వ్యాపారం ఎక్కువగా సాగుతుందా? లేదా? అనేది స్పష్టమవుతుంది. అటువంటి రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. ఆర్బీఐ వడ్డీ రేట్లప తీసుకునే నిర్ణయం మేరకు కొత్త ఇళ్ల కొనుగోళ్లు జరుగుతాయి. వడ్డీరేట్లను బట్టి గృహ రుణాలు తీసుకోవాలా? వద్దా? అనేది ఆలోచిస్తారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) భేటీ ప్రారంభమైంది. సమావేశం వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. కీలక వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. ఆగస్టు 10న గవర్నర్ శక్తికింత్ దాస్ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తారు.
Read alsoఫ Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో దశ ప్రకటించిన కాంగ్రెస్.. ఈ సారి యాత్ర ఎక్కడి నుంచంటే?
Also Read
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
- Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
దేశంలో ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు గతేడాది మే నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. అయితే చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ భేటీలో 6.25 శాతంగా ఉన్న రెపో రేటును కొంత మేరకు పెంచి 6.5 శాతానికి పెంచింది. ఫిబ్రవరి తర్వాత జరిగిన రెండు భేటీల్లోనూ ఆర్బీఐ వడ్డీ రేట్ల జోలికి పోలేదు. ఈ నేపథ్యంలో ద్వైమాసిక భేటీలోనూ వడ్డీ రేట్లలో పెంపు ఉండబోదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో కీలకంగా పరిగణించే రెపో వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథంగా ఉంచే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, భౌగోళికంగా ఉన్న అనిశ్చితుల కారణంగా వడ్డీ రేట్లులో ఆర్బీఐ ఎటువంటి మార్పులు ఉండబోదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల పెరిగి టమాటా ధరలు కూడా ఎంపీసీ భేటీపై ప్రభావం చూపబోవని మరికొందరు చెబుతున్నారు. వడ్డీ రేట్లు స్థిరంగా కానసాగిస్తే వ్యక్తిగత, గృహ రుణాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంటుందని మార్కెట్ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
-
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
-
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
ట్రెండింగ్
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..