RBI MPC Meeting: కీలకం కానున్న ఎంపీసీ మీటింగ్.. వడ్డీ రేట్లపై ఆతృతగా ఎదురు చూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI MPC Meeting: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి కొన్ని వ్యాపార లావాదేవీలు ఆధారపడి ఉంటాయి. ఆర్బీఐ తీసుకునే నిర్ణయంతో ఆయా రంగాల్లో వ్యాపారం ఎక్కువగా సాగుతుందా? లేదా? అనేది స్పష్టమవుతుంది. అటువంటి రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. ఆర్బీఐ వడ్డీ రేట్లప తీసుకునే నిర్ణయం మేరకు కొత్త ఇళ్ల కొనుగోళ్లు జరుగుతాయి. వడ్డీరేట్లను బట్టి గృహ రుణాలు తీసుకోవాలా? వద్దా? అనేది ఆలోచిస్తారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) భేటీ ప్రారంభమైంది. సమావేశం వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. కీలక వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. ఆగస్టు 10న గవర్నర్ శక్తికింత్ దాస్ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తారు.
Read alsoఫ Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో దశ ప్రకటించిన కాంగ్రెస్.. ఈ సారి యాత్ర ఎక్కడి నుంచంటే?
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
దేశంలో ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు గతేడాది మే నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. అయితే చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ భేటీలో 6.25 శాతంగా ఉన్న రెపో రేటును కొంత మేరకు పెంచి 6.5 శాతానికి పెంచింది. ఫిబ్రవరి తర్వాత జరిగిన రెండు భేటీల్లోనూ ఆర్బీఐ వడ్డీ రేట్ల జోలికి పోలేదు. ఈ నేపథ్యంలో ద్వైమాసిక భేటీలోనూ వడ్డీ రేట్లలో పెంపు ఉండబోదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో కీలకంగా పరిగణించే రెపో వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథంగా ఉంచే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, భౌగోళికంగా ఉన్న అనిశ్చితుల కారణంగా వడ్డీ రేట్లులో ఆర్బీఐ ఎటువంటి మార్పులు ఉండబోదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల పెరిగి టమాటా ధరలు కూడా ఎంపీసీ భేటీపై ప్రభావం చూపబోవని మరికొందరు చెబుతున్నారు. వడ్డీ రేట్లు స్థిరంగా కానసాగిస్తే వ్యక్తిగత, గృహ రుణాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంటుందని మార్కెట్ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!