రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో దేశ వృద్ధి రేటుకు సంబంధించి ఆయన తన అంచనాను వెల్లడించారు. ఈ అంచనా ప్రకారం.. FY 25కి దేశ జీడీపీ వృద్ధి తక్కువగానే ఉండవచ్చు. ఈ సమావేశంలో 25 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను గవర్నర్ 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించారు.
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ఈ సారి కూడా రేపో రేటులో ఎలాంటి మార్పులు తీసుకురాలేదని ఆయన వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నారు. ఎంపీసీ గత 10 సమావేశాల్లో కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. 11వ సమావేశంలో కూడా 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు…