Monsoon Update: గుడ్న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు
- మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు
- హర్యానా..పంజాబ్.. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు వాతావరణ శాఖ శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Update: ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే రుతుపవనాలు వ్యాపించని రాష్ట్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. పంజాబ్, హర్యానాకు రుతుపవనాలు ఎప్పుడు వస్తాయో ప్రకటించింది. మండే వేడిని ఎదుర్కొన్న తర్వాత, రుతుపవనాలు ఢిల్లీకి కూడా వచ్చాయి, అయితే పంజాబ్, హర్యానా ప్రజలు ఇంకా రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం, రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో పంజాబ్, హర్యానాతో సహా దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఆ తర్వాత యూపీ-బీహార్ తరహాలో ఈ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి.
Read Also: Collapse: ఢిల్లీ తర్వాత గుజరాత్ లో భారీ ప్రమాదం.. కూలిన రాజ్కోట్ ఎయిర్ పోర్టు టెర్మినల్
Also Read
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
- BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
హిమాచల్ ప్రదేశ్లో ఆరెంజ్ అలర్ట్
హిమాచల్ ప్రదేశ్లోని 12 జిల్లాల్లో ఏడింటిలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని వివిధ చోట్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు గురువారం హిమాచల్ ప్రదేశ్లోని అనేక ప్రాంతాలకు చేరుకున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఇప్పటివరకు సిమ్లాలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం, సబర్బన్ ప్రాంతం జుబ్బర్హట్టిలో 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోహర్లో 42 మిమీ, మషోబ్రాలో 39.5 మిమీ, స్లోపర్లో 34.6 మిమీ, కుఫ్రి, షిలారులో 24.2 మిమీ, సరహన్, బర్తిన్లలో 22 మిమీ, ఘగాస్లో 18.8 మిమీ, కర్సోగ్లో 18.2 మిమీ వర్షపాతం నమోదైంది.
Read Also: Pawan Kalyan: జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..
ఉత్తరాఖండ్లో వ్యాపించిన రుతుపవనాలు
ఢిల్లీ-ఎన్సీఆర్ తర్వాత ఉత్తరాఖండ్లో కూడా రుతుపవనాలు వ్యాపించాయి. రుతుపవనాల రాకతో సామాన్యులు పర్వతాల్లో ప్రయాణించకుండా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఐఎండీ ప్రకారం, రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఉత్తరాఖండ్లోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు పర్వత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీకి రుతుపవనాల రూపంలో విపత్తు
రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ వాసులకు రుతుపవనాల తొలి వర్షం విపత్తుగా మారింది. నిజానికి, మొదటి వర్షం సమయంలో ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం, శుక్రవారం ఉదయం 8:30 గంటల ముందు 24 గంటల్లో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది జూన్లో సగటు వర్షపాతం 74.1 మిమీ కంటే మూడు రెట్లు ఎక్కువ. 1936 తర్వాత 88 ఏళ్లలో ఈ నెలలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈ రోజు ఉదయం కూడా ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది.
తాజావార్తలు
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
-
BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!