PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పు వేగవంతంగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు తాము ‘‘ఉమ్మడి పౌరస్మృతి’’ తీసుకువస్తున్నామని శనివారం ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బెంగాలీలు మైనారిటీలు కాకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పారు.
ముస్లింల ఆధిపత్యం ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్లో బహిరంగం సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ సాగిస్తున్న ‘‘మహా జంగిల్ రాజ్’’ పాలనకు ముగింపు పలికేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్షా విడుదల చేసిన బీజేపీ ఎన్నికల మానిఫెస్టో ఒక మార్గసూచిక అని మోడీ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని చెప్పారు.
Read Also: US-Iran Talks: “అమెరికాను నమ్మలేం”.. చర్చల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్..
ఆర్జీకర్ హత్యాచార కేసులో నిందితులకు మమతా సర్కార్ ఎలా అండగా నిలిచిందో రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఆయన అన్నారు. ‘‘మా -మాటీ-మనుష్’’ అనే నినాదంతో టీఎంసీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పుడు చొరబాటుదారుల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ బుజ్జగింపు, ఓట్ బ్యాంక్ రాజకీయాల ఆటను ఇకపై బెంగాల్ సహించదని, రాష్ట్రంలో బెంగాలీలు మైనారిటీలుగా మారడానికి తాము అంగీకరించమని ప్రధాని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరుల్ని జైలుకు పంపుతామని చెప్పారు.
భారత్ అంతా శ్రీరామ నవమి జరుపుకుంటే, బెంగాల్లో టీఎంసీ అండతో రామనవమి ర్యాలీపై దాడులు జరుగుతున్నాయని, హింస చోటుచేసుకుంటుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఖామని భావించి, కుట్రలకు పాల్పడుతూ ఏఐ వీడియోలను వ్యాప్తి చేస్తుందని ప్రధాని ఆరోపించారు.
