Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
- 4,399 రోజులు పూర్తి.. ఎన్నికైన ప్రధానిగా మోడీ కొత్త చరిత్ర
- 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
- పేదల సంక్షేమం నుంచి చంద్రయాన్ వరకు విజయాల ప్రస్తావన
- ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంపై కేబినెట్ పూర్తి విశ్వాసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi : భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అరుదైన చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలు అందించిన ‘ఎన్నికైన’ ప్రధానమంత్రిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ కాల పరిమితి రికార్డును దాటేశారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రివర్గం (కేబినెట్) ప్రత్యేకంగా సమావేశమై ప్రధానికి ఘనంగా అభినందనలు తెలిపింది. దేశ ప్రజలు ఆయనపై ఉంచిన అపారమైన విశ్వాసానికి, ఆశీర్వాదాలకే ఈ ఘనత నిదర్శనమని కేబినెట్ కొనియాడింది. తనను తాను “ప్రధాన సేవక్”గా భావిస్తూ దేశ సేవకే అంకితమైన మోడీ నాయకత్వంలో భారతదేశం సరికొత్త పుంతలు తొక్కిందని కేంద్ర మంత్రులు ప్రశంసించారు.
గడిచిన 12 ఏళ్ల పాలనలో పేదల సంక్షేమాన్నే కేంద్రబిందువుగా చేసుకుని మోడీ ప్రభుత్వం ముందుకు సాగిందని కేంద్ర కేబినెట్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. దేశంలోని కోట్లాది మంది పేదలకు పక్కా ఇళ్లు, విద్యుత్, గ్యాస్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించడమే కాకుండా 80 కోట్ల మందికి ఉచిత రేషన్, 60 కోట్ల మందికి ఆరోగ్య భద్రతను కల్పించినట్లు పేర్కొంది. ఫలితంగానే దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడే అవకాశం లభించిందని తెలిపింది. వీటితో పాటు యువత, స్టార్టప్లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం అపూర్వమైన ప్రోత్సాహాన్ని అందించిందని, చంద్రయాన్ విజయంతో భారత శాస్త్ర సాంకేతిక సామర్థ్యం ప్రపంచ వేదికపై మెరిసిందని కేబినెట్ కొనియాడింది. మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే, రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ నిధి, మద్దతు ధరల పెంపు, సాగునీటి ప్రాజెక్టులకు మోడీ ప్రభుత్వం ఎంతో ఊతాన్ని ఇచ్చిందని స్పష్టం చేసింది.
Also Read
- DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
దేశ భద్రత, ఆర్థిక సంస్కరణల విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవని కేంద్ర కేబినెట్ అభిప్రాయపడింది. ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ అమలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) వంటి ఏళ్ల నాటి డిమాండ్లను తీర్చడంతో పాటు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ వంటి సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారని కొనియాడింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ తయారీ రంగానికి కొత్త ఊపు వచ్చిందని తెలిపింది. అంతర్జాతీయంగా భారతదేశానికి లభించిన జీ-20 అధ్యక్షత దేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా శిఖరాగ్రానికి చేర్చిందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం, సోలార్ అలయన్స్ వంటి కార్యక్రమాలకు అంతటా గుర్తింపు లభించిందని పేర్కొంది. దేశంలో నెలకొన్న రాజకీయ స్థిరత్వం వల్లే ఈ వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని, అటు ఆధునిక అభివృద్ధిని ఇటు దేశ వారసత్వాన్ని సమన్వయం చేస్తూ కొత్త భారతదేశ నిర్మాణం జరుగుతోందని కేబినెట్ అభినందించింది. మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, ప్రధాని నరేంద్ర మోడీకి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కేంద్ర కేబినెట్ ఆకాంక్షించింది.
తాజావార్తలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!