Mood of the Nation survey: 2024లో బీజేపీకే అధికారం.. 335 స్థానాలతో మోడీకి పట్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mood of the Nation survey: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హ్యట్రిక్ కొట్టబోతోందని ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే అంచనా వేసింది. మరోసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నట్లు చెప్పింది. 2024 ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ఈ సర్వే చర్చనీయాంశంగా మారింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కమాండింగ్ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే, బీజేపీ చెబుతున్న 400 స్థానాల కన్నా తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దేశంలోని అన్ని లోక్సభ స్థానాల్లో 35,801 మంది అభిప్రాయాలతో, డిసెంబర్ 15, 2023 మరియు జనవరి 28, 2024 మధ్య సర్వేని నిర్వహించారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 335 సీట్లు వస్తాయని, మరోసారి అధికారాన్ని నిలుపుకుంటుందని, మొత్తం 543 లోక్సభ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ఎక్కువ సీట్లను సునాయాసంగా సాధిస్తుందని సర్వే అంచానా వేసింది. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 18 సీట్లు కోల్పోతున్నట్లుగా తెలిపింది. ఇదిలా ఉంటే, ఇండియా కూటమి 166 స్థానాలను సాధిస్తుందని సర్వే వెల్లడించింది.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Viral Video: బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. విండో కోసం గొడవ..
543 స్థానాల్లో బీజేపీ సింగిల్గా 304 స్థానాలను కైవసం చేసుకుంటుందని, 2019లో సాధించిన 303 స్థానాల కన్నా ఒక సీటుని ఎక్కువగానే గెలుస్తుందని అంచనా. కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా 19 స్థానాలను అధికంగా గెలుచుకుని, మొత్తంగా 71 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తెలిపింది. 168 స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు విజయం సాధిస్తారని అంచనా వేసింది.
రామ మందిర విషయాన్ని మోడీ పాలనలో అత్యంత ప్రధాన అంశంగా ప్రజలు భావిస్తున్నారు. 42 శాతం మంది దీనిని గుర్తించారు. 19 శాతం మంది ప్రధాని మోడీ ప్రపంచంలో భారత్ స్థాయిని పెంచారని, 12 శాతం మంది ఆర్టికల్ 370 రద్దు, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడం వంటివి బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నట్లు సర్వేలో ప్రజలు వెల్లడించారు. అవినీతిరహిత పాలనకు 14 శాతం క్రెడిట్స్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, ఉత్తర భారత దేశంలో బీజేపీకి తిరుగు లేకుండా ఉంది. ముఖ్యంగా హిందీ బెల్ట్లో బీజేపీ పలు రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేస్తోందని సర్వే చెబుతోంది. నార్త్లో 180 స్థానాలకు గానూ ఎన్డీయే 154, ఇండియా కూటమి 25 స్థానాల్లో, సౌత్లో 132 స్థానాల్లో ఎన్డీయేకి 27, ఇండియా కూటమికి 76, తూర్పు ప్రాంతంలో 153 స్థానాల్లో ఎన్డీయేకి 103, ఇండియా కూటమికి 38, పశ్చిమాన 78 స్థానాల్లో ఎన్డీయేకి 51, ఇండియా కూటమికి 27 స్థానాలు వస్తాయని సర్వే వెల్లడించింది.
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!