Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
- మోడీతో సీఎం విజయ్ భేటీ
- ప్రధానంగా రెండు సమస్యలపై కీలక విజ్ఞప్తులు
- 20 నిమిషాల పాటు సాగిన కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు మోడీతో విజయ్ కీలక చర్చల జరిపారు. ఈ సందర్భంగా రెండు కీలక వినతలు సమర్పించారు. అలాగే తమిళనాడుకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Also Read
- Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
- Radhamohan Mishra: తానే దేవుడి స్వరూపమని చెప్పుకుంటూ.. మహిళను ఏళ్ల తరబడి హింసించి అత్యాచారం.. మూత్రం తాగాలని బలవంతం
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
ఇటీవల నెదర్లాండ్స్ నుంచి ప్రాచీన చోళుల కాలానికి చెందిన రాగి ఫలకాలను తిరిగి భారత్కు తీసుకురావడంపై ప్రధాని మోడీకి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మేకేదాటు ప్రాజెక్టు వల్ల తమిళనాడుకు కావేరీ జలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని విజయ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కావేరీ జల వివాదం ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పుల ఆత్మకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర అనుమతి అవసరమైన ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వవద్దని జల్ శక్తి మంత్రిత్వ శాఖకు సూచనలు చేయాలని ప్రధాని మోడీని కోరారు.
ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మేకేదాటు ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన DPRను త్వరలో కేంద్రానికి సమర్పిస్తామని ప్రకటించారు. తమిళనాడుకు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే హక్కు లేదని వ్యాఖ్యానించడంతొ రెండు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది.
అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో తమిళనాడు రాష్ట్ర గీతం ‘తమిళ్ థాయ్’కు అనుమతి ఇవ్వాలని మరో కీలక విజ్ఞప్తి చేశారు. జాతీయ గీతం, జాతీయ గానం కలిసి ఉన్న సందర్భాల్లో ముందుగా పూర్తి స్థాయిలో ‘వందే మాతరం’ ఆలపించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జనవరిలో జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో DRDOకి చెందిన ‘సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్’ను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘనవిజయం సాధించింది. 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం చిన్న పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విశ్వాస పరీక్షలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ సభ్యుల మద్దతుతో విజయం సాధించారు.
తాజావార్తలు
-
Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 తేదీ వచ్చేసింది.. ప్రైమ్ మెంబర్లకు భారీ డిస్కౌంట్లు
-
Sunil Gavaskar: “పంత్, సంజూ కాదు.. 2027 వరల్డ్ కప్లో వికెట్ కీపర్ అతడే”.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
ట్రెండింగ్
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!