Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
- మోడీతో సీఎం విజయ్ భేటీ
- ప్రధానంగా రెండు సమస్యలపై కీలక విజ్ఞప్తులు
- 20 నిమిషాల పాటు సాగిన కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు మోడీతో విజయ్ కీలక చర్చల జరిపారు. ఈ సందర్భంగా రెండు కీలక వినతలు సమర్పించారు. అలాగే తమిళనాడుకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
ఇటీవల నెదర్లాండ్స్ నుంచి ప్రాచీన చోళుల కాలానికి చెందిన రాగి ఫలకాలను తిరిగి భారత్కు తీసుకురావడంపై ప్రధాని మోడీకి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మేకేదాటు ప్రాజెక్టు వల్ల తమిళనాడుకు కావేరీ జలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని విజయ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కావేరీ జల వివాదం ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పుల ఆత్మకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర అనుమతి అవసరమైన ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వవద్దని జల్ శక్తి మంత్రిత్వ శాఖకు సూచనలు చేయాలని ప్రధాని మోడీని కోరారు.
ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మేకేదాటు ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన DPRను త్వరలో కేంద్రానికి సమర్పిస్తామని ప్రకటించారు. తమిళనాడుకు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే హక్కు లేదని వ్యాఖ్యానించడంతొ రెండు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది.
అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో తమిళనాడు రాష్ట్ర గీతం ‘తమిళ్ థాయ్’కు అనుమతి ఇవ్వాలని మరో కీలక విజ్ఞప్తి చేశారు. జాతీయ గీతం, జాతీయ గానం కలిసి ఉన్న సందర్భాల్లో ముందుగా పూర్తి స్థాయిలో ‘వందే మాతరం’ ఆలపించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జనవరిలో జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో DRDOకి చెందిన ‘సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్’ను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘనవిజయం సాధించింది. 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం చిన్న పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విశ్వాస పరీక్షలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ సభ్యుల మద్దతుతో విజయం సాధించారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!