Haryana: బ్రజ్ మండల్ యాత్ర.. నుహ్లో ఇంటర్నెట్ బంద్..
- హర్యానా నుహ్లో ఇంటర్నెట్ బంద్..
- బ్రిజ్ మండల్ యాత్ర సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం..
- గతేడాది ఇదే ప్రాంతంలో మత ఘర్షణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: గతేడాది హర్యానా నుహ్ ప్రాంతంలో భారీగా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రకు ముందు నుహ్ జిల్లాలోని ఇంటర్నెట్ని, బల్క్ ఎస్ఎంఎస్ సేవల్ని 24 గంటల పాటు నిలిపేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపేయబడుతాయని హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) అనురాగ్ రస్తోగి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నుహ్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు, ప్రభుత్వ-ప్రైవేట్ ఆస్తులకు నష్టం, ప్రజాశాంతి, ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా తప్పుదు సమాచారం, పుకార్లను వ్యాప్తిని ఆపేందుకు ఈ సేవల్ని నిలిపేసినట్లు చెప్పారు. యాత్ర సజావుగా జరిగేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నుహ్ పోలీసులు తెలిపారు. గతేడాది జూలై 31న హర్యానా నుహ్లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపుపై ఒక గుంపు దాడికి పాల్పడింది. రాళ్లు, కత్తులు, తుపాకులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడగా, ఇద్దరు హోం గార్డులు మరణించారు. అదే రాత్రి గురుగ్రామ్లోని మసీదుపైమ మరో గుంపు దాడి చేసింది. మత ఘర్షణల్లో కనీసం ఐదుగురు మరణించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!