Haryana: బ్రజ్ మండల్ యాత్ర.. నుహ్లో ఇంటర్నెట్ బంద్..
- హర్యానా నుహ్లో ఇంటర్నెట్ బంద్..
- బ్రిజ్ మండల్ యాత్ర సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం..
- గతేడాది ఇదే ప్రాంతంలో మత ఘర్షణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: గతేడాది హర్యానా నుహ్ ప్రాంతంలో భారీగా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రకు ముందు నుహ్ జిల్లాలోని ఇంటర్నెట్ని, బల్క్ ఎస్ఎంఎస్ సేవల్ని 24 గంటల పాటు నిలిపేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపేయబడుతాయని హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) అనురాగ్ రస్తోగి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నుహ్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు, ప్రభుత్వ-ప్రైవేట్ ఆస్తులకు నష్టం, ప్రజాశాంతి, ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా తప్పుదు సమాచారం, పుకార్లను వ్యాప్తిని ఆపేందుకు ఈ సేవల్ని నిలిపేసినట్లు చెప్పారు. యాత్ర సజావుగా జరిగేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నుహ్ పోలీసులు తెలిపారు. గతేడాది జూలై 31న హర్యానా నుహ్లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపుపై ఒక గుంపు దాడికి పాల్పడింది. రాళ్లు, కత్తులు, తుపాకులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడగా, ఇద్దరు హోం గార్డులు మరణించారు. అదే రాత్రి గురుగ్రామ్లోని మసీదుపైమ మరో గుంపు దాడి చేసింది. మత ఘర్షణల్లో కనీసం ఐదుగురు మరణించారు.
తాజావార్తలు
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?