MK Stalin: “పోలీసుల క్షమించరాని చర్య”.. లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ..
- తమిళనాడు లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ చేస్తూ స్టాలిన్ నిర్ణయం..
- మృతుడు అజిత్ కుమార్ తల్లికి సారీ చెప్పిన సీఎం..
- నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు.
Read Also: War 2: ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ
Also Read
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
ఇదిలా ఉంటే, ఆలయ సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ఇది ఎవరూ సమర్థించలేని లేదా క్షమించలేని చర్య’’ అని అన్నారు. ఐదుగురు పోలీసులను నిందితులుగా చేర్చింది ప్రభుత్వం. దర్యాప్తు నిష్పాక్షికత కోసం కేసు సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసుల చర్య సమర్థనీయం కాదని పేర్కొంటూ.. ఇలాంటి చర్యలు ఎక్కడా, ఎప్పుడూ జరగకూడదని హెచ్చరించారు. దర్యాప్తు కోసం తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేరం పట్ల అజిత్ కుమార్ కుటుంబానికి సీఎం స్టాలిన్ క్షమాపణ చెప్పారు. అజిత్ కుమార్ తల్లిని క్షమించాలని కోరారు. ధైర్యంగా ఉండాలని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అజిత్ శరీరంపై 44 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ ఎస్ఎం సుబ్రమణ్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి వీపు, నోటీ, చెవుల వద్ద కారం పొడి ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి నేర చరిత్ర లేని వ్యక్తిపై ఇలాంటి దాడి ఏంటని పోలీసుల్ని, ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ దాఖలులో ఆలస్యం, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించడంలో వైఫల్యం, పోలీసుల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడంపై రాష్ట్రానికి “ఎటువంటి అభ్యంతరం” లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Hair Care Tips: తలకు నూనె రాస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందా? నిజం ఎంత..?
-
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్ల్లోనే ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..