MK Stalin: “పోలీసుల క్షమించరాని చర్య”.. లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ..
- తమిళనాడు లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ చేస్తూ స్టాలిన్ నిర్ణయం..
- మృతుడు అజిత్ కుమార్ తల్లికి సారీ చెప్పిన సీఎం..
- నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు.
Read Also: War 2: ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ
Also Read
ఇదిలా ఉంటే, ఆలయ సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ఇది ఎవరూ సమర్థించలేని లేదా క్షమించలేని చర్య’’ అని అన్నారు. ఐదుగురు పోలీసులను నిందితులుగా చేర్చింది ప్రభుత్వం. దర్యాప్తు నిష్పాక్షికత కోసం కేసు సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసుల చర్య సమర్థనీయం కాదని పేర్కొంటూ.. ఇలాంటి చర్యలు ఎక్కడా, ఎప్పుడూ జరగకూడదని హెచ్చరించారు. దర్యాప్తు కోసం తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేరం పట్ల అజిత్ కుమార్ కుటుంబానికి సీఎం స్టాలిన్ క్షమాపణ చెప్పారు. అజిత్ కుమార్ తల్లిని క్షమించాలని కోరారు. ధైర్యంగా ఉండాలని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అజిత్ శరీరంపై 44 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ ఎస్ఎం సుబ్రమణ్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి వీపు, నోటీ, చెవుల వద్ద కారం పొడి ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి నేర చరిత్ర లేని వ్యక్తిపై ఇలాంటి దాడి ఏంటని పోలీసుల్ని, ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ దాఖలులో ఆలస్యం, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించడంలో వైఫల్యం, పోలీసుల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడంపై రాష్ట్రానికి “ఎటువంటి అభ్యంతరం” లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!