MK Stalin: “పోలీసుల క్షమించరాని చర్య”.. లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ..
- తమిళనాడు లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ చేస్తూ స్టాలిన్ నిర్ణయం..
- మృతుడు అజిత్ కుమార్ తల్లికి సారీ చెప్పిన సీఎం..
- నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు.
Read Also: War 2: ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ
Also Read
ఇదిలా ఉంటే, ఆలయ సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ఇది ఎవరూ సమర్థించలేని లేదా క్షమించలేని చర్య’’ అని అన్నారు. ఐదుగురు పోలీసులను నిందితులుగా చేర్చింది ప్రభుత్వం. దర్యాప్తు నిష్పాక్షికత కోసం కేసు సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసుల చర్య సమర్థనీయం కాదని పేర్కొంటూ.. ఇలాంటి చర్యలు ఎక్కడా, ఎప్పుడూ జరగకూడదని హెచ్చరించారు. దర్యాప్తు కోసం తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేరం పట్ల అజిత్ కుమార్ కుటుంబానికి సీఎం స్టాలిన్ క్షమాపణ చెప్పారు. అజిత్ కుమార్ తల్లిని క్షమించాలని కోరారు. ధైర్యంగా ఉండాలని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అజిత్ శరీరంపై 44 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ ఎస్ఎం సుబ్రమణ్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి వీపు, నోటీ, చెవుల వద్ద కారం పొడి ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి నేర చరిత్ర లేని వ్యక్తిపై ఇలాంటి దాడి ఏంటని పోలీసుల్ని, ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ దాఖలులో ఆలస్యం, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించడంలో వైఫల్యం, పోలీసుల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడంపై రాష్ట్రానికి “ఎటువంటి అభ్యంతరం” లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!