Himachal Pradesh: అరుదైన సంఘటన.. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
- హిమాచల్ప్రదేశ్లో అరుదైన దృశ్యం ఆవిష్క్రతం
- 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
- ఆనందోత్సవాల్లో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు తప్పిపోయాడు. తిరిగి వస్తాడని ఎదురుచూశారు. కానీ తిరిగి రాలేదు. 15 ఏళ్లు అయిపోయింది. దీంతో చనిపోయి ఉంటాడని భావించి ఆశలు వదులుకున్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత హఠాత్తుగా కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ కన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. ఈ సంఘటన హిమాచల్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: భారత్కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!
Also Read
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
బల్దేవ్ కుమార్.. హిమాచల్ ప్రదేశ్లోని సుజన్పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామవాసి. 15 ఏళ్ల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ ఇంట్లో నుంచి పారిపోయాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు తిరిగి వస్తాడని భావించారు. కానీ తిరిగి రాకపోవడంతో చనిపోయాడని భావించారు. పోలీసులు కూడా వెతికి.. వెతికి చేతులెత్తేశారు. జాడ కనిపెట్టలేకపోవడంతో చనిపోయి ఉంటాడని భావించి విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Padayappa re-release : రీ-రిలీజ్ సందడి మధ్య రజనీ షాకింగ్ అనౌన్స్మెంట్..
అయితే 3 రోజుల క్రితం రాజస్థాన్లోని బికనీర్లోని గౌరవ్ జైన్ కుటుంబం ఒక వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతని ఆచూకీ గుర్తించాలని కోరారు. ఆ వీడియో కాస్త హిమాచల్ప్రదేశ్లోని సుజన్పూర్లోని సప్నా కుమారికి చేరింది. ఈమె కూడా పలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆశ్చర్యకరంగా బల్దేవ్ కుమార్ కుటుంబ సభ్యులకు వీడియో చేరింది. దీంతో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కొడుకేనంటూ తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే బికనీర్లో ఉన్న బల్దేవ్ కుమార్ దగ్గరకు బయల్దేరి వెళ్లిపోయారు. కన్న కొడుకును చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం బల్దేవ్ కుమార్ను హిమాచల్ ప్రదేశ్లోని సుజన్పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామానికి తీసుకొచ్చారు. చాలా గ్రాండ్గా డప్పులు, బాకాలు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇక సోషల్ మీడియా ద్వారా తమ కొడుకును దగ్గరకు చేర్చిన సప్నా కుమారి, గౌరవ్ జైన్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెల్లించారు. ఇక బల్దేవ్ కుమార్ ప్రస్తుతం మాజీ సైనికుడిగా ఉన్నారు.
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!