MUDA Land Scam: సిద్ధరామయ్యకు మద్దతుగా మైనారిటీ, బీసీ సంఘం పాదయాత్ర..
- ముడా స్కామ్లో ఇరుక్కున్న సీఎం సిద్ధరామయ్య..
- కేసు నమోదు చేసి విచారించాలని కోర్టు ఆదేశం..
- సిద్ధరామయ్యకు మద్దతుగా మైనారిటీ-బీసీ సంఘం పాదయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA Land Scam: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) ల్యాండ్ స్కామ్ కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతికి ఈ స్కామ్లో ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మైసూర్ నగరాభివృద్ధికి పార్వతి నుంచి సేకరించిన భూమి విలువ కన్నా, నగరంలోని ప్రైమ్ ఏరియాల్లో అత్యంత ఖరీదైన 14 ప్లాట్లను కేటాయించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరగాలని బుధవారం కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు సీఎంపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని ఆదేశించింది.
Read Also: PM Modi: రూ.130 కోట్లతో తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన మోడీ..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
మైనారిటీలు, వెనకబడిన తరగతులకు సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంలో రాజకీయ సామాజిక ఉద్యమం ‘నేషనల్ అహిందా ఆర్గనైజేషన్’ అక్టోబర్ 03న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతుగా మార్చ్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మద్దతు ఇవ్వాలని అహిందా ఆర్గనేషన్ భావించింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని కోరింది.
అహింద నాయకుడు (సిద్దరామయ్య)ని కాపాడేందుకు జాతీయ అహింద సంస్థ హుబ్బళ్లి నుంచి బెంగళూరు వరకు రాజ్యాంగ అవగాహన యాత్రను ప్రారంభిస్తున్నామని, ఈ పాదయాత్రలో వెనకబడిన తరగులు, దళితులు, అహిందా సంఘాల నాయకులంతా పాల్గొంటారని అహింద రాష్ట్ర అధ్యక్షుడు ముత్తన్న శివల్లి అన్నారు. సిద్ధరామయ్య అల్పసంఖ్యాకులు (మైనారిటీలు), హిందువులు (వెనుకబడిన తరగతులు),దళితులు (దళితులు) కోసం నిలబడే అహింద ఉద్యమానికి ప్రధాన వ్యక్తిగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!